పుట:DivyaDesaPrakasika.djvu/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పళ్ళికొండ - 35

రంగనాథస్వామి-శ్రీరంగనాయకి-వ్యాసపుష్కరిణి-శేషశయనం-శయనించినమూర్తి-అంబరీష మహారాజునకు ప్రత్యక్షం.

మార్గము: తమిళనాడులో గుడియాత్తం స్టేషన్ నుండి 3 కి.మీ.

మీంజూర్ - 36

వరదరాజస్వామి-పెరుందేవిత్తాయార్-అనంతసరస్సు-రోమపాద మహర్షికి ప్రత్యక్షము.

మార్గము: మద్రాసుకు 30 కి.మీ.

పొన్నేరి - 37

హరికృష్ణ పెరుమాళ్-సుందరవల్లి త్తాయార్-సుందరపుష్కరిణి-సుందరవిమానము-అరణినది-భరద్వాజ మహర్షికి ప్రత్యక్షము.

మార్గము: పొన్నేరి స్టేషన్ నుండి 3 కి.మీ.

నాగలాపురం - 38

వేదనారాయణస్వామి-వేదవల్లిత్తాయార్-వేదవిమానము-మత్స్యతీర్థము.

విశే: ఫాల్గుణమాసములో మూడుదినములు సూర్యరశ్మి పెరుమాళ్లపై ప్రసరించును. మిగతాదినములలో ఈవిధముగా ప్రసరించదు.

మార్గము: తిరువళ్లూరు నుండి 25 కి.మీ.

పుష్పగిరి - 39

చెన్నకేశవస్వామి-రాఘవస్వామి-పెన్నానది.

విశే: పెన్నానదీ తీరమునగల పుణ్యక్షేత్రము. ఆది శంకరాచార్యుల మఠము కలదు.

మార్గము: కడపకు 15 కి.మీ.

కదిరి - 40

నరసింహస్వామి-లక్ష్మీత్తాయార్-కదిరివృక్షము.

విశే: ఇది మిక్కిలి ప్రాచీనమైన క్షేత్రము. పదకవితా పితామహుడగు అన్నమాచార్యుల వారు కీర్తించిన క్షేత్రరాజము.

మార్గము: ధర్మవరం-పాకాలలైనులో కదిరిస్టేషన్.

165