పుట:DivyaDesaPrakasika.djvu/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నడిగడ్డపాలెం - 45

సీతారామస్వామిసన్నిధి-శ్రీమత్పరమహంసేత్యాది శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారి సన్నిధి కలవు.

విశే: డ్రీమద్రామాయణ సుందరమును రచించిన పరమ భక్తాగ్రేసరులగు శ్రీవాసుదాస స్వామివారు నిర్మించుకొన్న ఆశ్రమం. ఇది శ్రీమత్పరమహంసేత్యాది శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారికి సమర్పింపబడినది. వారిని తిరుప్పళ్లిచేర్చి అర్చారూపముగా వేంచేపు చేయుటచేత పవిత్రమైన స్థలము. ఆంధ్ర దేశమున శ్రీవైష్ణవ ప్రచారమునకై యావజ్జీవితము శ్రమించి అసంఖ్యాకులకు ఆచార్యులై శతాధిక గ్రంథకర్తలైన కులపతులు ఉ.వే.శ్రీమాన్ తె.కం. గోపాలాచార్యస్వామి వారు ఇటీవల వరకు నిర్వహించిన క్షేత్రరాజము.

మార్గము: గుంటూరు జిల్లా చుండూరు స్టేషన్‌కు 5 కి.మీ.

167