పుట:DivyaDesaPrakasika.djvu/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60. తిరువణ్ పరిశారమ్‌ 2

శ్లో. తిరువణ్ పరిశార పట్టణే వరలక్ష్మీ సరసా సమన్వితే|
   సురదిగ్వదనోపవేశనో వినతాకారి విలోచనాతిథి:||

శ్లో. ఇంద్ర కల్యాణ నిలయ: తిరువాళ్ మార్పనాహ్వయ:|
   దేవ్యా కమల వల్ల్యాయం రేజే శఠరిపుస్తుత:||

వివ: తిరువాళ్ మాఱ్పన్(తిరుక్కురళప్పన్)-కమలవల్లి తాయార్-లక్ష్మీతీర్థం-తూర్పు ముఖము-కూర్చున్నసేవ-ఇంద్ర కల్యాణ విమానము-వినతకు, ఉడయ నంగైయార్‌కు(నమ్మాళ్వార్ల తల్లిగారు)కారి.(నమ్మాళ్వార్ల తండ్రిగారు)-గరుడాళ్వార్లకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్లు కీర్తించిన క్షేత్రము.

విశే: ఈ దివ్య దేశమునకు "అచ్చేరి" అను విలక్షణమైన తిరునామము కలదు. ఈస్వామి విషయమై నమ్మాళ్వార్లు సౌకుమార్యమను గుణమును ప్రకాశింప జేసియున్నారు.

సంసారులు శబ్దాది విషయలంపటులు-నిత్య సూరులు భగవదను భవమున మునిగినవారు. వీరెవరును స్వామిమిశ్రమను గుర్తించుటలేదు. కావుననే అతి సౌకుమార్యముగల స్వామి "అழிయుమ్‌ శబ్గుమ్‌ శుమప్పార్ తామ్‌" అనునట్లు శంఖ చక్రములను తానే స్వయముగా భరించుచున్నాడే "వాళుమ్‌ విల్లుమ్‌ కొణ్డు పిన్ శెల్వార్ మత్తిల్లై" శంఖ చక్రములను విల్లును తీసికొని వెనుక నడుచు వారు ఎవరునులేరే" యని ఆళ్వార్లు సర్వేశ్వరుని సౌకుమార్యమను గుణమును ప్రస్తుతించిరి.

నమ్మాళ్వార్ల తల్లిగారైన ఉడయనంగై యార్ అవతారస్థలము. వారి సన్నిధి కోయిలకు సమీపముననే గలదు. ఇచట ఆళ్వార్లు బాల్యదశాసూచకమైన అర్చారూపమున వేంచేసియున్నారు.

మార్గము: కన్యాకుమారికి ఉత్తరమున 20 కి.మీ దూరమున నాగర్‌కోయిల్‌కు 4 కి.మీ. దూరమున గలదు. తిరువాట్టారునుండి "తొడువెట్టి" చేరి బస్సు మారి నాగర్ కోయిల్ చేరవచ్చును. వసతులు స్వల్పము.

పా. ఆళుమాళారాழிయుమ్; శజ్గుమ్‌ శుమప్పార్ తామ్;
    వాళుమ్‌ విల్లుజ్కొణ్డు; పిన్ శెల్వార్ మற்றிలై;
    తాళుమ్‌ తోళుమ్; కైగళై యారతొழ்క్కాణేన్;
    నాళుమ్‌ నాళుమ్‌ నాడువ; నడియేన్ --లత్తే.

పా. వరువార్ శెల్‌వార్; వణ్ పరిశారత్తిరున్ద; ఎన్
    తిరువాழ் మార్వఱ్కెన్; తిఱమ్‌ శొల్లార్ శెయ్‌వదెన్;
    ఉరువార్ శక్కరమ్; శజ్గు శుమన్దిజ్గుమ్మోడు;
    ఒరుపాడుழల్వా; నోరడియాను ముళనెన్ఱే
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-3,7

77