పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము

13


జేజే వెరెట్ట నీదుశత్రులు భళీ శ్రీమన్మహారాజ రా
జాజంగక్షితిపాలకోత్తమ బిడౌజా రాజతేజోనిధీ.

54


సీ.

అని పద్యముఖముగా నభినుతుల్ గావించు
        వరకవీశ్వరుల దీవనలు గాంచి,
దేవతాయతనసత్కృతితటాకవనాది
        సప్తసంతానప్రశస్తి గాంచి,
యాసేతుశీతాచలాంతరాళంబుల
        నిజయశఃస్థేమంబు నెఱయఁగాంచి,
నలువురు సతుల విన్నాణంబు దులకించి
        సీతావధూటితో సిరులఁగాంచి,


తే.

ఆయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
గలిగి రేపల్లెనగరశృంగారసౌధ
రత్నసింహాసనస్థితి రాజ్య మేలు
భవ్యగుణశాలి జంగభూపాలమాళి.

55


శా.

ఆజంగక్షితిపాలు తమ్ముఁ డలరున్ హస్తాగ్రభాస్వద్ధనూ
రాజద్వజ్రముఖాదిఘోరశరధారాదారితారాతిసే
నాజంఘాలగజాంగభూషణభరానమ్రావనీధారణే
హాజాగ్రన్నిజబాహుఁడై దిరుపతిక్ష్మాధీశ్వరుం డిమ్ములన్.

56


సీ.

శ్రీరామపదపద్మసేవాధురీణుండు
        వరదుఁ డాశ్రితజనవత్సలుండు,
కలనైనఁ బలికి బొంకని మహాసరసుండు
        సదమలాచారవిశారదుండు,
నీవార మనువారి నెఱవేర్చుధీరుండు
        శూరుండు పరవధూసోదరుండు,
హరివాసరవ్రతాధ్యవసాయనిరతుండు
        చేపట్టి వీడని సిరుల టెంకి,