పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

కృత్యవతరణిక


తే. పరిహరించుచు సమధికప్రాభవమున
బ్రాతిమెయి నాత్మపతి భక్తి పాదు కొలిపి
యత్తవారింటఁ బూలచేరెత్తి నట్లు
భవ్యములఁగూర్చు నచ్చమాంబావధూటి.

50


మ.

స్తిమితారాతి విచేష్టితుండు ఘనుఁ డాసీతన్న మాణిక్య రా
య మహారాజకులావతంసునకు నచ్చాంచావధూటీవతం
సమునందుం బ్రభవించి రిర్వురు సుతుల్ జంగన్నమాణిక్యరా
యమహారాజకులేంద్రుఁడుం దిరుపతిక్ష్మాధీశ్వరుండున్ రహిన్.

51


సీ.

శ్రీ పున్నెపలికుల క్షీరాబ్ధిచంద్రుండు
        బాంధవాననపద్మపద్మహితుఁడు,
కృష్ణానివంశవర్ణితరాజతిలకుండు
        శాత్రవద్విరదపంచాననుండు,
హంవీరవీరసాహసవిక్రమార్కుండు
        కామితఫలదానకల్పశాఖ,
పద్మనాయకవరప్రాగల్భ్యమహితుండు
        సంపత్పరంపరాసమహితుండు,


తే.

లాలితశ్రీవిలాసుండు లక్ష్మణాంబి
కాకలితగర్భశుక్తిముక్తాఫలంబు
మన్నెహంవీర బిరుద సీతన్నభూప
నరకుమారుండు జంగభూవల్లభుండు.

52


ఉ.

ఆయుగధర్మ మాయుగమునంద యథావిధి చోదితంబుగాఁ
జేయగలేరు నాఁటినృపసింహులు మానికరావు జంగభూ
నాయకసార్వభౌముఁడు ఘనస్థితిఁ దా ఘటియించు దానదీ
క్షాయుతుఁడై కలిం గృతయుగంబున కర్హములైన ధర్మముల్.

53


శా.

ఆజిన్ రాజిలి గుంటురీపురవరప్రాంతంబున న్నిద్దపుం
దేజీ నెక్కి గుబాటునన్ దఱుముచున్ ధేయంచు బిట్టార్చినన్