పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

కృత్యవతరణిక


తే.

ఆయనయనుంగుఁదమ్ముఁడై యలరుచుండు
రసికజనమౌళి వల్లభరాయమౌళి
తలప నందఱకును ముద్దుఁదమ్ము డగుచు
ప్రబల సీతన్న మాణిక్యరాయశౌరి.

41


గీ.

ఇందు వెంకటరాయ ధాత్రీశు నాత్మ
భవుఁడు గోపాలక క్షమాపాలకుండు
తండ్రి తాతల కైవడి ధరణి యేలె
నర్థిజనకల్పభూరుహం బనఁగఁ బరగి.

42


శా.

ఈగోపాలవిభుండు ముత్యపుతురాయీ మేలిసిర్పేషమున్
జాగీరున్ మనసోజ[1] నాల్గునగలున్ ఝండా నగారా కరిన్
బ్రాగల్భ్యంబున గోలకొండ దొరచేఁ బాపించి దీపించె రా
జాగోపాలకరావటంచు సవిశేషంబౌ కితాబందుచున్.

43


క.

సుతు లిరువు రప్ప ధాత్రీ
పతికిం ప్రభవించి రగ్రభవుఁడు రఘుపతి
క్షితిపతి రాజ్యము గైకొనె
నతని సహోదరుఁడు తిరుపతన్నయుఁ దనరెన్.

44


మహాస్రగ్ధర.

శూరుం డప్పావనీభృత్సుతుఁడు రఘుపతి క్షోణిపాలుండు రాజ్య
శ్రీరూఢుండై నిజామక్షితిపతి హిత మార్జించుచుం గాంచెఁ దా జా
గీరున్ ఝండా నగారా కెలకుల సిరులగ్గించు వింజామరమ్ముల్
స్ఫారత్కుంభిన్ దురాయీ బలుగొడుగు దెసల్ ప్రాకురాజాకితాబున్.

45


గీ.

శ్రీరమణభూమిపాలుండు నారసింహు
వల్లభేంద్రుండు శేషాఖ్యు వాసి మీఱ
గాంచి కొండొక కాలంబు కలిమి బలిమి
గలిగి చెలఁగిరి శత్రుభీకర నిరూఢి.

46


క.

అల తిరుపతి రాయనికిం
గులసతియెడ గలుగు నాఱుగురిలోపలఁదాఁ

  1. మనసోబు