పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము 5


నిబ్బరపున్ బ్రభావసరణిం బురణించి ధరాధినాథులై
జొబ్బిలి వేడుకం దనరుచుం గనుచుందు రభీప్సితార్థముల్.

17


ఉ.

పౌరుషశాలియై తనరు పాదుషహా హిత మాచరింపుచున్
భూరితరప్రభావమునఁ బొంపెసలారెడు పద్మనాయకుల్
వారికి వారికిం దగిన వైభవముల్ గని పెంపు మీఱగాఁ
గూరిమితోడఁ [1]బుణ్యపలి గోత్రభవుల్ గని రీప్సితార్థముల్.

18


గీ.

వారి వంశంబు కృష్ణా[2]నివంశ మయ్యె
రఘుకులంబునఁ గోదండరాము లీల
నందుఁ బ్రభవించె నొక్క మహామహుండు
సాహసోత్సాహనిధి బంధుజనహితుండు.

19


శా.

ఆధీరాగ్రణి జాగ్రదాగ్రహకృతాహంకారహుంకారదు
స్సాధాయోధనవీధికాధికరిపుగ్మాభృన్మహాసుచ్ఛటల్
క్రోధోద్యత్కరవాలకాలఫణిచేఁ గ్రోలింపుచున్ దుర్జన
ప్రాధాన్యం బెడలించుఁ దాఁ గుతుపశాపాచ్ఛాహితాపాదియై.

20


సీ.

తనయాజ్ఞ నౌఁదలఁ దాలిచి కోవెల
        కొండ యేలిన యట్టి నిండుదనము,
పదిలుఁడై తాఁ బంప [3]మెదకు మ(వ?)లంగర
        దుర్గంబు గాచిన దొడ్డతనము,
తనముద్రఁ జెల్లించి ధనికుఁడై పెదకొండ
        పలి దుర్గమునఁ జేయు ప్రాభవంబు
తనపంపు గని పెంపు దనరారఁగాఁ గొండ
        వీటి దుర్గము నేలు విక్రమంబు


గీ.

భావమున మెచ్చి కుతుపశా ఠీవి నొసగె
[4]తెలనిశానీ నగారా ప్రదీప్తధవళ

  1. పుణ్యపరి
  2. కృష్ణాతి
  3. మెదకువతో లింగ
  4. తెల....గారా