పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 కృత్యవతరణిక


తే.

కలశపాథోధి నడుదీవి కమ్రకనక
మణిమయంబైన భవ్యధామమున శేష
ఫణిగణాంగణశయ్యపైఁ బవ్వళించి
రహి గులుకుచుండు నాదినారాయణుండు.

18


శా.

శ్రీ నీలారమణీమణీకరతల శ్రీగంధలేపార్హమై
నానామౌని మనస్సరోజపరమానందానుసంధానమౌ
నా నారాయణునంఘ్రిఁ బుట్టిరి పవిత్రాచారులై విక్రమ
శ్రీ నిండార్మఁగఁ బదనాయకమణుల్ శ్రీగంగ సైదోడుగన్.

14


సీ.

ధర్మానుకూలవర్తనమున సుగుణులై
        వంశానుచరితంబు వదల రెందు,
సరసభాషారూఢిఁ జతురాననాఢ్యులై
        సత్యానుగతి వీడఁజాల రెందు,
తలఁకని ఘనతచే ధారాళవృత్తులై
        శరణ మందిన వారి సడల రెందు,
పద్మనాయకలీలఁ బద్మానుకూలురై
        కువలయక్షోభంబు గూర్చ రెందు,


తే.

నరయ గంగాసహోదరు లగుచు భూరి
జీవనమునకు నొడ్లను జెనక రెందు
శ్రీమహావిష్ణు చరణరాజీవయుగళి
నవతరించిన పద్మనాయకులు ధరణి.

15


శా.

అందుం డెబ్బదియైదు గోత్రములుగా నన్యోన్యమున్ బంధులై
చందంబుల్ విభజంచి యేకసమయాచారంబునన్ ధీరులై
డెందంబుల్ దళుకొత్త మోదములతో ఢిల్లీశుఁడౌ పాదుశా
హుందోరున్నతి మెచ్చఁ గొల్చిరి రణోద్యోగంబులం దాప్తులై.

16


ఉ.

డెబ్బది యైదు గోత్రముల ఠీవి నెనంగెడు పద్మనాయకుల్
ప్రబ్బిన కూర్మి నాద్యుఁడగు పాదుషహా హిత మాచరింపుచుం