పుట:Delhi-Darbaru.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

మైసూరు రాజ్యము.


ముల నెనర్చుట యయియుండెను. అందువలన నతఁడు నీటి నసతుల 'నేర్పవచుట యందును రైలుమార్గముల నిర్మించుట యందును అత్యంత పరిశ్రమ సేయ కడఁగెను. అతనికా కార్య ముల నెల్ల సహాయుఁ డగుటకు నతనిచే దివానుగ నెన్ను కొనఁ బడియుండిన రంగాచార్యులకంటె నెక్కుడు సమర్థుఁ డెవ్వడు గలఁడు?

కృష్ణ రాజేంద్రుఁడు పరమపదమందిన వెంటనే అతని నగరునందలి ద్రవ్యరాసులను భూషణావళులను పరులు దోచు కొనకుండం గాచుట యందును, రాజభవన సేవక సమూహ మును సంస్కరించి ఉచిత భంగిని దీర్చుటయుదును, శ్యామ రాజేంద్రుని దత్తత నెదుర్కొని రాజ్యమపహరింప నే తెం చిన దురాతులను. విఫల మనోరధులుగఁ జేయుట యందును, సంపూర్ణ హృదయముతోఁ గార్యములు నెరవేర్చిన ఈరంగా చార్యులు అతనికిఁ దోడు నీడయయి నేటి మైసూరు సంస్థాన మందలి ఉత్తమ స్థాపన లన్ని టికీని విత్తునాటిన వాడని చెప్ప నచ్చును. శ్యామరా జేంద్రుఁడు సింహాసనము నెక్కుటతోడనే దివాను అధ్యక్షుడుగ మఱి ఇరువురు సభ్యులం జేర్చి యొక ఆలో చన సభ నేర్పఱచెను. వీరి కే చట్టముల నిర్మించు సధికారముగూడ నియ్యఁబడెను. రంగాచార్యులవారి కృషి చే కొలఁది కాలము లోనే మైసూరు ప్రతినిధి సభ ఏర్పడెను. దీనికిని దివానే అధ్య తుఁడయ్యెను. ఇందలి సభ్యులు మొదట మొదట మహారాజు