శ్యామరాజేంద్ర ఒడయరు.
353
అప్పు డేర్పడిన నిబంధనల ననుసరించి సాహాయ్య సైన్య వ్యయములకుగాను మైసూరు మహారాజు సంవత్సరమునకు ముప్పదియైదులక్షల ద్రవ్యము నిచ్చునట్లును, అతఁడు అంతః పరి పాలనక య్యు స్వసంరక్షణకయ్యు నియమించుకొను సైనికుల సంఖ్య గవర్నరుజనరలుగారి అనుమతి ననుసరించి తీర్చుకొన వలసినట్లును, అతఁడు పర రాష్ట్రములతో సంబంధములు కలి గించుకొనకుండు నట్లును, అన్ని విషయములందును గవర్నరు జనరలుగారి బోధనలను మహారాజు గమనింప వలసినట్లును, నిబంధనలను మించి అతఁడు ప్రవ ర్తించినచో నాంగ్లేయులకు రాజ్యము స్వాధీనమగునట్లును, దీర్మానింపఁ బడెను. ఇట్టికట్టు దిట్టములతో శ్యామరాజేంద్రుఁడు రాజ్య భారమును సహింపఁ బ్రారంభించు నప్పటికి మైసూరునకుఁ గొన్ని దురవస్థలు సంఘ టిల్లి యుండెను. ఏబది సంవత్సరము లాంగ్లేయులు ప్రభుత్వము నెఱపి సంస్కారముల నొనర్చి ఆదాయము నెక్కుడు చేసి యుండి రనుట సత్య మేకాని 1876వ సంవత్సరమున సంభవించిన మహా క్షామమువలన బొక్క సమున నిలువయుండిన రెండుకోట్లు అదృ శ్యమయి యుంటయే కాక ఆంగ్లేయులకు మైసూరు మహారాజు 80 లక్షల రూపాయలు అప్పుపడి యుండెను. రాజ్యములోని ప్రజలలో నైదవవంతు దుర్భిక్షమువాతఁ బడి మరణమంది యుండిరి. కావున శ్యామరా జేంద్రునకు మొదటి కర్తవ్యము ముందు క్షామములు రాకుండ నాపుటకు వలయు సదుపాయ