పుట:Delhi-Darbaru.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

మైసూరు రాజ్యము.



నాఁటినుండి శ్యామ రాజేంద్రుని విద్యాభ్యాసముప్రారంభింపఁ బడెను. ఆవిషయమును గూడ కృష్ణ రాజు ఒడయరు నకును స్థానికాం గ్లేయ ప్రభువులకును గొంత దూరము చర్చ జరిగెను. కాని కృష్ణ రాజ ఒడయరు అభిప్రాయమే. కడపట ఆమోదింపఁ బడెను. అయిన నతని చే శ్యామరా జేంద్రు నకు నుపాధ్యాయుఁడుగ నిర్ణయింపఁబడిన లెఫ్టనంటు కర్నలు హేయిన్సు అనునతఁడు 1869వ సంవత్సరమున రాజీనానూ నిచ్చెను. అతనికి దరువాత నతని స్థానమున ప్రసిద్ధచరిత్ర కారుఁడగు కర్నలు జి. బి. మాలిసను "నేమింపఁబడెను. అతనికి సహకారులుగఁ దరువాత దివానుపదమును సమర్థతతో నలం కరించిన రంగాచార్యులును, శ్యామురాజేంద్రుఁడు చదువుచుం డిన బడిలోని ప్రధానోపాధ్యాయుఁడగు జయ రామరావును నియమింపఁబడిరి. వీరును దరువాత మఱి కొందఱును గఱుప శ్యామరా జేంద్రుఁడు వలసిన జ్ఞానమును సమకూర్చు కొనెను. కృష్ణ 'రాజ ఒడయరు 1868లో నె మృతినొంది యుండెను. అప్పుడే శ్యామరా జేంద్రుఁడు పదునెనిమి దేండ్ల వయస్సు వాఁడయిన తోడనె అతఁడు విద్యాదికముల చే నర్హుఁడనితోఁచిన యెడల కొన్ని నిబంధనలతో సింహాసనమునకు రాగలఁడని ఆంగ్లేయ ప్రభుత్వము వారు చాటియుండిరి. "కావున యుక్తవయస్కు డయినపిదప 1885వ సంవత్సరమున శ్యామరా జేంద్ర ఒడయరున కాం గ్లేయులు మైసూరురాజ్య పరిపాలనము నిచ్చి వేసిరి.