పుట:Delhi-Darbaru.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్యామరాజేంద్ర ఒడయరు.

355


గారినలన నే నిర్వచింపఁ బడుచుండిరిగాని ఇప్పుడు ప్రజలకు నిర్వ చనశక్తు లియ్యఁబడినవి. ఇంతియగాక శ్యామ రాజేంద్రుని కాలమున బంగారు గనులఁ బనిచేయుట ప్రారంభింపఁ బడెను. . దానినలన మైసూరున కిప్పటి యాదాయము వరుబడి పద్దులలో ముఖ్యమగు పద్దుగ నెన్నఁ బడుచున్నది. మైసూరునందు స్త్రీ విద్యకుఁగూడ బ్రారంభము 1881వ సంవత్సరముననె. సంపాదన విషయమున నేమి, విద్యావిషయమున నేమి పరిపాలనా సంవి ధానముల విషయముల నేమి ఇట్లన్ని విధముల శ్యామరా జేం ద్రుఁడును రంగాచార్యులును మైసూరు రాజ్యమును దినదిన ప్రవర్ధమానముగఁ జేయగలుగు మార్గముల వెదకీ అవలంబిం చిరి. 1883 వ సంవత్సరమున రంగాచార్యులు మద్రాసునందు పరలోక ప్రాప్తిఁ జెందెను.

అతని స్థానమునకు స5'. కె. శేషాద్రి అయ్యరుగారు నియమింపఁబడిరి. ఇతఁడును రంగాచార్యుల పథమున నే రాజ్య పరిపాలన మొనర్చెను. ఈతని కాలమున ప్రతినిధి సభకును దాని కధ్యక్షుఁడుగ నుండుచువచ్చిన ఈతనికిని ఈవిధమగు ప్రతి స్థాపన యొక్క ప్రథమావస్థ యందును స్వాభావికమైన కొద్ది పాటి సంఘర్షణ దప్పినది కాదు. కాని ఇతఁడధికారము వహిం చిన పదునెనిమిది సంవత్సరములలో (1883-1901) నీ ప్రతినిధి సభ అనుభవ జ్ఞానముల సంపాదిం చె ననుటకుసందియము లేదు.