పుట:Delhi-Darbaru.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

మైసూరు రాజ్యము.



సుఘములు ప్రారంభమాయెను. అంచె తపాలుపోయి నూతన తపాలా పద్ధతి నెగడెను. ఇట్లు ఆంగ్లేయ ప్రభువులచేఁ బరీ పాలింపఁబడు చుండు మండలములోనే యేవిశేషములు గలవో అవియెల్లయు మైసూరు నందుఁగాన నయ్యెను. కాని ఈ మార్పులు నలన మొదట చేసికొనిన నేమమును మాత్రము ఆంగ్లేయ ప్రభుత్వమువారు విడువనలసి వచ్చెను. వారు ఏషియను అధి కారులను అనేకులను నేమింపవలసిన వారైరి.

శ్యామ రాజేంద్ర ఒడయరు దత్తువ చ్చుట.

కృష్ణ రాజేంద్ర ఒడయరు ఆంగ్లేయధి కారులకు రాజ్యము నప్పగించిన తరువాత మూఁడు పర్యాయములు ప్రభు త్వము వారికి అర్జీ లిచ్చుకొని మఱల తన్ను రాజ్యమునకు నధికారి జేయవలసినదని వేసుకొనెను. ఆతఁడు కనుపఱచిన 'కారణములు మిక్కిలి యుక్తియుక్తములుగా నున్నవి. కానిఫల మేమియు లేదయ్యెను. 1866 న సంత్సరమునఁ బెట్టుకొనిన అర్జీలో దాను రాజ్యభారము వహించు నప్పటికి పదునా రేండ్ల పసివాఁడయినందునను దన విద్యాభ్యాసమునఁ గొంత స్వాతం త్ర్యా కాంక్ష ఆగ్లేయో పాధ్యాయుల నలన నే నేర్పఁబడినందు నను దాను అనుభవలోపమునఁ జేసి తప్పుత్రోవలఁ దొక్కి 'నది నిజమేయనియును, రానురాను దన యధీనమునుండి రాజ్యమును దొలఁగింపవలసి వచ్చుట ఆంగ్లేయులకుఁ దప్పకసంభ వించిన దేయనియును, కాని లోపములు దిద్దిన పిదపఁ దన్ను