పుట:Delhi-Darbaru.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్యామ రాజేంద్ర ఒడయరు దత్తునచ్చుట.

351


మఱల రాజ్యాధిరూఢు. జేయకుండుట వ్యాధి గ్రస్తుఁడయిన నానిని రోగముకుదిరిన తరువాతఁ గూడ మంచమునకుఁ గట్టి పెట్టి నట్లున్నదనియును, తనకు రాజ్యము నిచ్చినది వైజామును ఆంగ్లే యులును నైనందున ఆంగ్లేయులు దన్ను శాశ్వతముగ పదభ్ర ష్టుం జేయుట అన్యాయమనియును ఒక వేళఁదనకు ఆంగ్లేయుల దయవలన మాత్రమే రాజ్యము చేకూరియున్నను ఆ ప్రభుత్వ మువారు ఇచ్చినది మఱల పుచ్చుకొనుట ధర్మవిరుద్ధమనియును వ్రాసి షంపెను. అందులోనె అతఁడు తాను దత్తు చేసికొనిన పుత్రుఁడగు శ్యామ రాజేంద్రఒడయరునకు ముందు రాజ్యము లభింపవలసి యుండుటను గుఱించియు మొఱ వెట్టి కొనెను. ఆంగ్లేయ ప్రభుత్వమువారి చేతు లోనికి మైసూరు పోయిన దాదిగ ఆసీమను మఱల స్వదేశీయ ప్రభువుల కప్పగింప పని లేదను వాద మొక్కటి వెలువడి యుండెను. కావున భరత ఖండమునందలి ఆంగ్లేయ ప్రభువులు కృష్ణ రాజ ఒడయరు దత్తు చేసికొనుటకుఁ గూడ నాటంకములు దెచ్చి పెట్టఁ బ్రయత్నిం చుచుండిరి. కాని విక్టోరియా మహారాష్ట్ర గారి ఉదార హృదయ మునకు మాత్ర మీపద్ధతి సరిపడినది కాదు. అందుచే నాయమ యొక్క ఇష్టమున కనుగుణముగ కృష్ణ రాజ ఒడయరుచే ద పుత్రుఁడుగ స్వీకరింపఁబడి యుండిన శ్యామరాజేంద్ర ఒడయ రును ఆంగ్లేయ ప్రభుత్వము వారు మైసూరునకు భవిష్యత్పరి పాలకుఁడుగ నొప్పుకొనిరి.