పుట:Delhi-Darbaru.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాళుక్యులు.

303


కాని . అవి యవిశ్వసనీయములు. పేరును బట్టి చూడ నిది " శెల్యూకియా ' యను నామము మారుటవలన వచ్చినట్లు దోఁచుచున్న ది గావున వీరు చంద్రగుప్తచక్రవర్తి మామయగు తెల్యూకసు తెగకుఁ జేరిన వారయి యుండవచ్చుననియును అట్ల యినచో ఆ తెగవారికిని పల్లవుల పూర్వికులని మనమనుకొని, యెడి పారసీక దేశపు తెగవారికిని భారతవర్షమున కావల నే వైరము లుండుటంబట్టి దక్ష్మిణహిందూస్థానమున నీ పల్లవులకును చాళుక్యులకును జరిగిన ఘోర యుద్ధములు అనాదిశత్రుత్వము వలన నైనవని యూహింపవచ్చననియు రైసు వ్రాయుచు న్నాఁడు. కాని దీని నెంతవఱకు మనమాదరింపవచ్చ ననుట ముందు కాలమున తీర్మానము కావలసినదే. వీరి జన్మభూమి ' యెచ్చట నున్న నేమి, వీరు మాత్రము దక్షిణ హిందూస్థాన చరిత్రమునందు నాలుగైదు శతాబ్దముల కాలము ప్రాముఖ్య లలో నొక్కరుగఁ గన్పించుచున్నారు. వీటిలో మొదటివాఁడు జయసింహుఁడు. ఇతఁడు రాష్ట్రకూటులతో యుద్ధము చేసి వారిని జయిం చెను. "కాని పల్లవులతోఁ బోరుటలో మృతి చెందెను. ఇతని భార్య గర్భవతి పారిపోయి విష్ణు సోనుయాజియను బ్రాహణుని శరణుఁ జొచ్చెను. ఆయమ కుమారుఁ డగు మొదటి పులి కేశి పల్లవులను జయించి బాదామి(వాతాపి)రాజ ధాని చేసికొ నెను. అతని పుత్రుఁడు కీర్తివర్మ మౌర్యులను కదం బులను వశవర్తులను జేసి కొనెను. అతని యాత్మజుడు