పుట:Delhi-Darbaru.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

మైసూరు రాజ్యము.


మంగ ళేశుఁడు కళచుర్యులను జయించెను. ఇతని కొడుకగు 'రెండనపులి కేశి కాలమున నే చాళుక్య సామ్రాజ్యము మిక్కిలి విరివినందెను. ఇతఁడు రాజ్య మేలు నప్పుడే వేంగిపురము చాళుక్యులకు ప్రాప్తమయినది. ఆపట్టణము లభించుటతో చాళు క్యవంశము రెండు పాయలయి, పోయెను. రెండవ పులి కేశి రాజుగ పశ్చిమ చాళుక్యులును కుబ్జవిష్ణువర్ధనుఁడు రాజుగఁదూ ర్పు చాళుక్యులును పేరుగాంచఁ దొడంగి. తూర్పు చాళుక్యు లు వేంగియు రాజమహేంద్రవరమును ముఖ్య పట్టణములుగఁ బదునొకండవ శతాబ్దము నఱకును 'రాజ్య మేలి చోళులకు లోబడి పోయిరి. పశ్చిమ చాళుక్యులు మనకథకు నలసిన వారు గాన వారి చరిత్రనిట కొంచెము విరివిగ వ్రాయనలసి యున్నది,

రెండవపులి కేశి కన్యాకుబ్జమునకు రాజగు హర్ష వర్ధను నోడించి పర మేశ్వర బిరుదమును సంపాదిం చెను. అతనికిఁ దరు "వాత విక్రమార్కు డను రాజు 655 లో సింహాసనమునకు వచ్చు వఱకును పల్లవులు చాళుక్యులను బాధలు పెట్టు చుండిరని యూ హింషనలసి యున్నది. ఈవిక్రమార్కుడు మహశౌర్య సంప న్ను డు. రణరశికుఁడని ఇతనికి బిరుదు. ఇతఁడు పాండ్య, చోళ, కేరళ కలభ్రులను జయించి నను పల్ల వ రాజు నోడించ కంచి నాక్రమించుకొని నట్లును దెలియుచున్నది. ఇతని కుమారుఁ డును మనుమఁడును మునిమను మఁడును గూడ మిక్కిలి వీరత్వ మున రాజ్య మేలి నట్లు, గన్పించుచున్నది. కాని ఇతనిసంతతి