302
మైసూరు రాజ్యము.
లు
మాన్యపురము (మన్నెయను నెలమంగళము తాలూకాలోని
గ్రామము) నకు మార్చెను. ఆతఁడు గజశాస్త్రమను గ్రంథ
మును గూడ వ్రాసెనఁట. ఈతని కొడుకు శివమారుఁడు
రాజ్యమునకు వచ్చిన తరువాత నీగ్రంథము నే విపులము చేసి గజాష్ట
కమను మఱియొక గ్రంథము వ్రాసెనఁట. ఇతని కాలమున
రాష్ట్రకూటులు ప్రబలులై యీతని నోడించి చెర పెట్టిరి.
రాష్ట్రకూట ప్రభువు మారుటతోనే యితఁడు విడువఁబడెను
గాని మరల నీతఁడు రాష్ట్రకూట చాళుక్య హైహయులనందఱి
నెదుర్చుటచే రెండవమారు పట్టుబడినట్లు గానవచ్చుచున్నది.
కాని రాష్ట్రకూటులకు మిత్రులు కావలసి వచ్చిన దునను శివ
మారుఁడు స్నేహము చేసికొని నందునను గంగుల సంతతికి
మఱల స్వాతంత్ర్యము గలిగెను. ఈ ప్రకారము నెయ్యురయిన
రాష్ట్రకూటగంగులకును తూర్పు చాళుక్యులకును 108
యుద్ధములు జరిగెను. ఈమధ్య కాలమున గంగులు మహాబల
వంతులయిరిగాని తుదకు 1004 న మీ చోళులచే లోఁబఱ.
చుకొనఁబడి యిదివఱకు చెప్పినపగిది చాళుక్యులను హొయి
సణులను ఆశ్రయించిరి.
చాళుక్యులు
.
వీరిజన్మ భూమి యేదియైనదియుఁ జక్కఁగ విశడపడ లేదు. వీరయోధ్యనుండి వచ్చినట్లును చంద్రవంశము వారయి హరితి సంతతి వారయినట్లును పుక్కిటి పురాణములు గలవు.