పుట:Delhi-Darbaru.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖం డేరావు గాయిక వాడు.

259


మునఁ గొంత కాలము రెసిడెంటుగా నుండిన కర్నల్ లెప్టి నంటు అవుట్రామువలన ఋజువు పఱచఁ బడినందున బరోడా పై బొంబాయి ప్రభుత్వము వారి కుండిన అధికారము రద్దయి ఆ సంస్థానము యాజమాన్య ప్రభుత్వమువారి విచారణలో నుంచఁబడెను. (1864). ఈ విషయమయి. పోట్లాడుటలో అవు ట్రాము దన పదమునుండి తొలఁగింపఁబడి నిజముబయట వచ్చి నందున మజిల రెసిడెంటు పదమున కనుపఁబడెను, కొందఱు దుర్బోధనలం జేసి గణపతి రావు అవుట్రాము రాకకుఁ గొంచె మెది ర్చెను గాని ఆయభ్యంతరములు నిలువ లేదు. అతఁడు రెసిడెంటయి తన కార్యస్థానములోని దురారులను తొలగిం చివై చెను. 1856వ సంవత్సరమున మహారాజా గణపతిరావు బొంబాయి బరోడా రైలుదారి వేయుటకు వలయు భూమిని మంజూరు చేసెను. అదే సంవత్సర మే అతఁడు స్నానము చేయు చుండ నాకస్మికముగ మృతినం దెను. అతనికి మొగబిడ్డలు లేనందున నాతని తమ్ములలోఁ బెద్ద వాఁడగు ఖండేరావు సింహా సనమునకు వచ్చెను.

ఖండేరావు (1856-1870)

ఇతఁడు దనకుముందుఁ జనిన గణపతి రావు నకును, వెనుక రానున్న మల్హర రావునకును, భిన్నుఁడుగఁ గాన్పించు చున్నాఁడు. ఇతఁ డెంతో విద్యావంతుఁడు గాఁడుగాని కొంత సమర్థతగల వాఁడనుటకు సందియము లేదు. దేహపటుత్వమున