పుట:Delhi-Darbaru.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

IIదా మాజీ.

223


రాష్ట్ర బలంబుల నణంపఁ బ్రయత్నించు చుండుటం గాంచి ఈతఁడు తరుగని సాహసమున పెనఁగి ఏకమగు చుండిన మహమ్మదీయ శక్తుల నడచినై చెను. దీనికిఁ దరువాత బహు స్వల్ప కాలములో నే ఇతఁడు దన రాజధానిని సోనఘడు నుండి “పట్టను' నకు (అనఁగా ప్రాచీన అవొల్వాడకు) మార్చుకొ నెను. 1768 మొదలు 1766 లోనితఁడు మహమ్మదీయుల నుండి ప్రస్తు తపు 'కాడీ' ప్రాంతమునంతయు సంపాదించి 'కాథియవాడ యందుంగూడ విస్తారమగు భూభాగమును గడించెను.

ఈ విజయముల వలన నితని బొక్క.సమునకును మిక్కుట మగు ద్రన్యము చేరెను. ఈడా, రాజపిప్పలా సంస్థానములును గప్పములుగట్టువారైరి. ఇట్లుండ పానిపట్టు యుద్ధమునకు వెనుక అచిర కాలములోనే వీష్వా బాలాజీ పరమ పదమందెను. పసివా డగు మాధవ రావు పీష్వాపదమునకు వచ్చెను. అతనికాతని పిన తండ్రి రఘోబావలననె చిక్కులు తటస్థించెను. బాలాజి మృతి నొందు వఱకు దామాజి పన్నులలో నాతనికిఁ జేరవలసిన భాగ మును గ్రమముగ నిచ్చుచుండినను లేకున్నను ఆతని విషయ మునఁ గుట్రలుపన్నుటకు మాత్రము సాహసించి యుండ లేదు. కాని అతని తరువాత పీష్వాపదమున కై మాధవరావునకును, రఘోబాకును పెనఁగులాటలు దటస్థించి నప్పుడు పీష్వా యొక్క దుర్భర యాజమాన్యమును దప్పించుకొను నుద్దేశము తో దామాజి రఘోబాతోఁ జేరికొనెను. వీరిరువురకును గలి