పుట:Delhi-Darbaru.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Iదా మా జీI

219

.

చేరిన పిదప “దామాజి' స్వయముగ బయలు వెడలి అభయ సింగు రాజ్యమును అనఁగా జోధపుర ప్రదేశమును ఆక్రమించి కొల్లగొట్ట నారంభించెను. దీనికి జడిసి అతఁడు గుజరాతువదలి తన రాజ్యమును గా పాడుకొనుటకై పోయి చేరెను. అంతట. అభయసింగు స్థానమున ‘మోమినాను' అను నతఁడు బాదు షాహగారి ప్రతినిధిగఁ బంపఁబడెను.

అతఁడు అహమదాబాదునందలి మార్వాడీల తొంద రలకు, దాళ లేక 'దామాజీ'కి సేనానాయకుఁడగు రంగోజి యొక్క సాహాయ్యమును గోరి దాని కుపకృతీగ గాయిక వాడునకు గుజరాతు పన్ను లో నించుమించుగ సాబాలు నిచ్చి వేసెను. అట్లగుట 'దామాజి' కిని ఈ బాదుషాహ ప్రతినిధికిని 1742 లో“ దామాజి ' మృతినొందువఱకును స్నేహము వర్ధిల్లెను. రమారమి 'దొమాజ'కిని 'మోమిం ఖాను' నకును మైత్రిసమకూరు కాలమున నె గుజరాతునం దును కాథియవాడునందును గాయిక వాడు నధి కారము ప్రబలు ముగాఁ జొచ్చెను. బాన్నా పట్టువడుటయును నైజాము నౌకరుచే పాలితంబగుచుండిన బ్రోచిపట్టణమున వసూలగు సుంకముతోసర్థ భాగ మితనికిఁ జెందుటయును దీనికి నిదర్శన ములని చెప్పనొప్పును. ఇంతియగాదు. సేనాపతిగ నేర్పఱుసం బడిన జస్వంతరావు అసమర్థుఁడయినందున నితఁడే ఉమా ' బాయికీ ముఖ్యమంత్రియయి కార్యములు నడుపు చుండెను. కావున