పుట:Delhi-Darbaru.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

హైదరాబాదు సంస్థానము:


దర పెట్టఁ బ్రారంభించుట తోడ నె యతనికూపిరి త్రిప్పుకొన వీలు లేకపోయెను. కావున నతఁడు నైజాములకు రాజీనామా నిచ్చి 1848 వ సంనత్సరము సెప్టంబరు నెల 6 వ తేది పదవిని వదిలి పెట్టెను.

ఆంగ్లేయుల పై కుట్ర.

ఈ లోపుగజరిగిన సంగతి నొక్కటి నిట వ్రాయవలసి యున్న ది. 1839న సునత్సరమున ఒక పెద్ద కుట్ర యొకటి బయ ల్పడెను. ఉదయగిరి నవాబు ముఖ్యుముగ భరతవర్ష మునం దలి ప్రభువుల నేకులు చేరి ఆంగ్లేయులను బారదోలుట కొక విస్తారమగు కుట్రఁ బన్ను చుండుటను అప్పుడు నెల్లూరు నందు దండవిథాయకుఁడగు (magistrate) నుండినస్టోను హౌసు అను నతఁడు గనిపట్టెను. ఆకుట్రయందు నైజముగారి సోదరుఁడగు ము బారిజ్ -- ఉద్ దౌలా , గూడ కలఁడను హేతువు చే హైదరాబాదునందు రెసిడెంటుగారి యాధి పత్య ము క్రింద ఐరోపియనులును ఉత్తమస్వ దేశీయులును పంచా యతిగఁ జేరి యాకుట్రను గుఱించి గొప్ప విచారణ జరిపిరి. పదిమాసములు వ్యాయోగము నడచిన తరువాత ముబారిజ్ - ఉద్ - దౌలాయును నతని మిత్రుల నేకులును ఉదయగిరి నవా బుతో నుత్తరప్రత్యుత్తరములు సలిపి, మతా వేశ పరవశులగు వహబీల కుద్రేకమును బుట్టించి, చూగ్లేయులను భార దోలు నుద్దేశముతోఁ గుట్రపన్ని ఆంగ్లేయ ప్రభుత్వమునకును