పుట:Delhi-Darbaru.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహీపుత్ర రాముఁడు.

145


ముగారి మనసున కెక్కునట్లు ప్రవర్తించి యతని 'మన్న నవడసి ప్రతి రాజ్యాంగమందును (Department) వలయు సంస్కార ములన నేకముల నుపక్రమిం చెను.

మహీపుత్ర రాముఁడు.

బీరారునకుఁ బరిపాలకుఁడుగ నుండిన రాజా మహీ పుత్ర రాముఁడు 1805 సంనత్సరమున హైదరాబాదునకువచ్చి నైజాము స్నేహితులగు ఇ స్మేల్ - యాన్ - జంగు మున్నగు వారి ద్వారా అతనివద్ద పలుకుబడి సంపాదించుచుండెను. మహీపుత్రుఁ డెప్పగిది నైన - మీర్ - ఆలమ్ ను పదచ్యుతుని జేసి తానా స్థానము నాక్రమించుకొనఁ బ్రయత్నింప మొద లిడెను. మీర్ , ఆలమ్ కును ఆంగ్లేయాధికారియగు రెసి డెంటుకును గల యన్యోన్యమును బెంచి చెప్పి నైజామునకు సూర్ -ఆలమ్ పై నుదాసీన భావముఁ బుట్టింప మహీపుత్రుని పక్షమువారు పూనుకొనిరి. ముఖ్యమంత్రి పై వీరు బన్న మొద లిడిన కుట్రలను నైజామెఱింగియు నెఱుఁగని వానివలె నుండ నియ్యకొనెను. ఇట్టి సందర్భములలో రెసిడెంటు చర్చఁబుచ్చు కొని తీరవలసిన వాఁడాయెను. అతని నిర్బంధమువలన మహీ పుత్రుఁడు బీరారుఁ దన స్థానమునకు నెడలిపోవలసినదని యుత్తరువాయెను. కాని యిది నామకార్థము పుట్టిన యుత్తరువె. మహీపుత్రుఁడింకను నైజాముతో నాలోచనలు సేయుచు 'సింధియా హెల్కారులను దోడు చేసికొని మీర్ ఆలమ్ ను