పుట:Delhi-Darbaru.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

హైదరాబాదు సంస్థానము.


మార్గమునుండి తొలఁగించి ఆంగ్లేయ సంబంధమును మాన్పింపఁ బ్రయత్నించుచుండుటయుఁ దెల్ల మయ్యెను. దీనిపై గవర్నరు జనరలుగారి యుత్తరువు ననుసరించి రెసిడెంటు మహీపుత్రుని అతని సాహాయ్యులను నెంటనే తొలఁగించ వలసినదని నైజా మునకు దృఢముగఁ దెలియఁ జేసెను. అతఁడును నా ప్రకారమే చేయవలసిన వాఁడయ్యెను. ఇంతవఱకును దన కేమైనఁ గీడుకలు గు నేమోయని జంకి రెసిడెంటుగారి తోటయందొక భవనమున దాఁగియుండిన మీర్ - ఆలమ్ నగరుఁజొచ్చి మరల దనధర్మము నెర వేర్పఁ బారంభిచెను. నైజామును అతనిని గౌరవించి సమ్మానించెను. మహీపుత్రుని అతని పరిజనమును దొలఁగిం చుటవలన నిలువయున్న యుద్యోగములకు మీర్ - ఆలమ్ పక్షమువారు నేమింపఁబడిరి. అందుభీరారునకు రాజా చందూ లాల్ సోదరుఁడగు గరుడబక్షీ పరిపాలకుఁడుగ నేమింపఁబడెను. అతని సాయముస కైఁ గొంత యాంగ్లేయ సైన్యముగూడ బంపఁబడెను. దానిని జూ చినతోడని మహీ పుత్రుఁడు పోలాపుర మునకుఁ బారిపోయి యటనుండి కొంత కాలము నైజముగారి యెడ శత్రుత్వము పూని పోరి కట్టకడపట హెల్కారు శరణుఁ జొచ్చి యతనివలనఁ జుంపబడెను.

నైజాము స్థితి.

1808 వ సంవత్సరము వఱకును నైజామునకును ఆంగ్లే యులకును గల సంబంధమున విశేషాంశము లేవియు నుండ లేదు.