పుట:Delhi-Darbaru.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

హైదరాబాదు సంస్థానము.


జరిగెను. 1805వ సంవత్సరమున సింధియు గనిన యపజయము వలన ప్రథమ మహారాష్ట్ర విగ్రహము ముగిసెను. ఈవిగ్రహ మున సికందరుజా. ఆంగ్లేయుల కేమాత్రమును సాహాయ్యము చేసియుండ లేదు. అట్లుండియు శత్రువుల నుండి పట్టునడిన దేశ ములోఁగొంత భాగము నైజామున కీయఁబడెను. దీనివలన నితని రాజ్యము ఉత్తరమున వింధ్యాద్రులవఱకును వరదానదినఱకును వ్యాపించెను. ఈతరుణమున - బీరారు (Perar) పూర్తిగ నైజామునకుఁ జేరెను. 1804 న సంవత్సరమున నైజామలికి ముఖ్యమంత్రిగనుండి ప్రఖ్యాతి వడసిన ఆజమ్-ఉల్-ఉమ్రా పరలోక ప్రాప్తిఁ జెందెను. అతనిస్థానమున మీర్ ఆలంను నేమిం పవలసినదని రెసిడెంటుగారు సలహానిచ్చిరి. ఇతఁడు ఆజీమ్ - ఉల్-ఉమ్రా ముఖ్యమంత్రిపదము నందుండినపు డాతని కాప్తు డుగ కార్య భాగమును సహించిన వారలలో ముఖ్యుడు . అంతియ గాక ఆంగ్లేయుల యెడ నెక్కుడు భ క్తిగలవాడు, సంస్థానము పయి యనురాగము గలవాఁడు. కాని ఇతఁ డాంగ్లేయ ప్రతినిధి వలన నిర్వచింప బడుటం జేసి ముఖ్యముగ వారి వాఁడుగనే ఉండు నని తలంచి కాఁబోలు సికందరుజూ ఇతనిని నియమించుటకు మొట్ట 'మొదట ఇష్టపడ లేదు. అయినఁ దప్పదని రెసిడెంటు బలవంత పెట్టిన మీఁదట నైజూ మీతనికిఁ బూర్వపు ముఖ్యమంత్రికిఁ గల శక్తులలో ఒక కొన్నిటిని తగ్గించి - ఇతనిని ఆపదమున ముండనిచ్చెను. మీర్ -ఆలమ్ యుక్తిమంతుఁడు గావున నైజా