పుట:Delhi-Darbaru.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

హైద రా బా దు స్థాన ము.


లగు ప్రభువు లచ్చటచ్చట స్వాతంత్ర్యము ప్రకటించిరి. అట్ల గుట 1512 వ సంవత్సరము లోపల నైదుస్వతంత్ర సంస్థానము లేర్పడెను. అందు గోలకొండ కడపటిది.

దీనికి మొదటి రాజు కుతుబ్ షాహ. ఇతని సంతతి వారిలో మెక్కఁడగు మహమ్మదుకులి గోలకొండయందు నీటివసతి లేక పోవుటచే హైదరాబాదు గట్టించెను. దీనికి మొదటఁ దనప్రియు రాలి పేరు పెట్టఁదలఁచి భాగ్యనగరమని నామకరణము చేసెను. ఆమె మరణానంతరము దన కుమారుని పేరు సనుకరించి హైదరా బాదని మార్చెను. ఈ సంస్థానముతో సమానముగఁ దులఁదూ గినవి విజాపురము, అహమ్మదు నగరము. కావున నీమూఁడు సం స్థానములకును నంతఃకలహములు విడువక నడచుచుండెడివి. ఈ యంతఃకలహము లే వీరి నాశనమునకుఁ గడపటఁ గారణమయ్యె ను. మహారాష్ట్రుల విజృంభణంబునకును నిదియే హేతువు. 1586 లో అక్బరు, తరువాత షాజహాను, పిమ్మట నౌరంగ జేబు ఈ సంస్థానములను లోఁబజచుకొనిరి. అహమ్మదు నగరమునను విజాపురమునను మహారాష్ట్రులు ప్రవృద్ధిగాంచిరి. గోలకొండ యం దక్కన్న మాదన్నలను ఆంధ్రులు సచివత్వమున ప్రసిద్ధి గాంచిరి. శ్రీశివాజి శక్తియుక్తులవలన మహారాష్ట్రులు మొగ లాయి చక్రవర్తులింకను బలవంతులయి యుండఁగ నే సామ్రా జ్యము సంపాదింపఁ గలిగిరి. అక్కన్న మాదన్నల యన్నత్య మును సహింపలేని యొక తురుష్క నాయకుని విశ్వాసఘాతు