పుట:Delhi-Darbaru.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బహమనీ జ్యము లు.

107

. .

ఘూర్జరమును (Gujerat.)జయించి లోబఱచు కొనఁగా నప్పు డచ్చటి ప్రజల నేకులు దక్షిణాపధమునకు వచ్చి నిలచి యుండిన మొగలాయీల యండఁ జేరి. అది చూచి యోర్వలేక తుగ్లకు, శరణనిన వారికి శరణమిచ్చిన తన సామంతులనే చెజ వెట్టెను. ఇంతియేకాక, ఢిల్లీ నుండి తన రాజధానిని తాను దౌల తాబాదని . పేరిడిన " దేవగిరికి మా ర్చెను. జనులందఱును మొఱ పెట్ట సాగిరి. అప్పుడితఁడు మిక్కిలి క్రూర కార్యములకుఁ గడం గెను. ఒక పర్యాయము రాజధాని మార్చుటతోఁ దృప్తినొం దక' పౌరు లెల్ల యు దేవగిరి చేరిన తరువాత మరల' వారిని ఢిల్లీకి నడువుఁడనియెను. ఈ కారణములఁబట్టి తిరుగు బాటులు పుట్టెను. చక్రవర్తి సేనలొక రిద్దఱి నాపఁ గల్లెను గాని యల్లరు లెక్కు డయి హునేను భానుఁడను ప్రబలవిరోధి యెదుర్కొ-ను నప్పటి కివి విరిసిపోయెను. సై న్యాధిపతి యోడిపోయి నిహతుఁడ య్యెను. అంత హుసేనుఖాను “సుల్తాన్ అల్లాఉద్దీన్ హ నేనుఖాన్ గంగోబహమని” యను బిరుదులతో బహమనీ రాజ్య మును 1347 లో స్థాపించెను

బహమనీ రాజ్యములు.

గుల్బర్గ మీ రాజ్యమునకు మొదట రాజధాని. 1434 లో అహమదా బాదు రాజధానియాయెను. రానురాను బహమనీ రాజసంతతి వారు బలహీనులుగాఁ జొచ్చిరి. వారి పటుత్వము తప్పినందున వారికి లోఁబడి ప్రవర్తించి శక్తిగాంచిన బలవంతు .