బహమనీ జ్యము
109
కము వలనను, స్వామిద్రోహమువలనను, వీరు "మొగలాయీల చేతులలోఁ జిక్కి మరణమందిరి.
ఇవ్విధమున చెదరిపోయిన బహమనీ రాజ్య ముండిన యెడములో మహారాష్ట్ర సామ్రూజ్యమును మొగలాయీల రాజ్య ఖండమును నుండుట దటస్థించెను. 1683 వ సంవత్సర మున నౌరంగజేబు రెండవమారు దక్షిణాపథము పై దండయాత్ర వెడలునప్పటికి, శిజాజి పరలోకమున కేగి యుండెను. అతని కుమారుఁడు సాంబాజీ దైర్యము దప్ప దక్కిన తండ్రి సుగుణము లెవ్వియును గలవాఁడు గాఁడు. మహారాష్ట్ర సైన్యము గూడ జిందర వందరు యుండెను. కావున వీరు విజాపురమును గోలకొండయును మొగలాయీలనుండి కాపాడలేక పోయిరి. సాంబాజి పట్టువడి ఖయిదీయయి చంపఁబడియెను. " కాని దీని వలన మహారాష్ట్రులు పోరాటమును విడువ రైరి. వారి పితూ రీలకు నిలువ లేక ఔరంగ జేబు 1706 వ సంవత్సరమున అహమదు నగరమునకుఁ బారిపోవలసి వచ్చెను. అతఁడు శత్రు వులచేఁ జిక్కి చచ్చునంతటి తరుణ మొక్కటి గూడ తటస్థిం చెను. గాని యాతని యదృష్టవశమునఁ దప్పించుకొనెను. మరుసటి సంవత్సరముననే యితఁడు 89 ఏండ్ల ప్రాయమున మృతి మొందెను. ఇతని మరణానంతర మీతని పుత్రులు సింహా ససమునకయి పెనఁగులాడఁ జొచ్చిరి. ఇతని కాలమున నీతని కాపవర్గములో నొక్కఁడనఁదగు గాజరుద్దీనను సుబేదారు.