పుట:Dashavathara-Charitramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంత నంతటంబోక యనలు నంతకు నసుర నబ్ధిపు ననిలు నలకేశ్వరు నలికలోచ
ను నన్యు లగునమరుల నతులితంబు లగునస్త్రంబుల నదటణంచి యట్టహాసం
బడరించిన.

425


తే.

వెఱచి తెఱగంటి మూఁకలు మొఱలు వెట్ట, నమరపతి సేదదేరి యుదగ్రుఁ డగుచుఁ
గులిశధారను ఖండించె బలుని మొదట, వెనుకఁ బాకాసురునిఁ ద్రుంచె విక్రమమున.

426


ఉ.

వారలపాటుఁ జూచి యనివారితరోషకషాయితాక్షుఁ డై
వీరవతంసుఁడౌ నముచి విక్రమశాలి యనేకఘంటికో
దారము మత్తశాత్రవవిదారము నైన త్రిశూల మెత్తి హుం
కారము మీఱ వాసవ పొకాలుము దీన నటంచు వైచినన్.

427


వ.

అదియుఁ బ్రళయకాలకాలఫాలలోచనకీలికీలాకరాళం బై నిగిడిన యట్టిశూ
లంబు తూలంబులీల నతివేలంబై యాలంబున నేలంబడ వాలంబున నేసి తద్దనుజ
కంఠనాళంబు ఖండింప నాఖండలుం డఖండదోర్మండలమండనాయితం బగు
శతకోటి జళిపించి వైచిన నదియు శతకోటిమార్తాండమండలపిచండిలరుచి
మండలప్రచండతాఖండనపండితమన్యం బగుచు సంవర్తసమయప్రవర్తిత
పుష్కలావర్తప్రముఖచటులతరమేఘపటలనిర్దళదనర్గళజాగ్రద్దీర్ఘనిర్ఘాతసం
ఘాతలింగంబు లగు విస్ఫులింగంబులు తోరంబై నిగుడం గనుంగొని దనుజ
పుంగవుండు గలంగక చెలంగుచు మదీయవక్షఃస్థలికుందనంపుతాళికి నొకయ
పూర్వవజ్రంబు లేదు గదా యని వెదకుచుందు నదియుఁ ద్రిదళపతి యంపెనే
కదా యని యెదయిచ్చిన వజ్రంబును జనుమఱగ్రుచ్చి వెనువిచ్చి చనలేక
యచ్చటనే యున్నం గనుంగొని వియచ్చరప్రవరుఁ డిది యేమి యెచ్చటనుం
గాన మిట్టి యచ్చెరు వని రిచ్చవడి కనుంగొనుచు వెచ్చనూర్చుచున్న సమ
యంబున నార్ద్రంబును శుష్కంబును గాని దాన నముచిదానవుండు దెగు
నని నిదానంబు దెలిపిన నాకాశవాణి పలుకు నాకర్ణించి నలుదిక్కులుం బరికించి
శైత్యప్రభావమానితవజ్రఘనసారం బగుచుఁ గనుపట్టు వారాశిడిండీరంబు
భవిష్యన్నముచిహననజనిష్యమాణయశస్సౌరభకారణకుసుమమంజరిం జేపట్టు
విధంబున హస్తారవిందంబున హంసంబు చందంబున గనుపట్టం గైకొని దివ్య
తేజంబు సంధించి యనార్ద్రశుష్కం బిది యౌ గదా యని ప్రయోగించిన
నదియు నింద్రప్రతాపభూపాలునిసమీపంబున వెలుంగు చంద్రజ్యోతితెఱం
గున రంగై నిజాభిముఖవిజయలక్ష్మికి సుపర్వాధిపతి సమర్పించు కర్పూరనీరా
జనంబుడంబున విరాజమానం బై బలిదైత్యత్రిలోకాధిపత్యవినాశసూచకం
బై పడునుడువువడువున బెడంగై నముచిప్రాణాపకర్షణసమావతన్మృత్యు