పుట:Dashavathara-Charitramu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని వైరోచని పలికిన, విని బలి నను వాఁడు దేవవిభుఁడు కృతఘ్నుం
డని రోయక సరిచేసుక, చనునే మాటాడ రాత్రిచరమూర్ధన్యా.

414


క.

క్షణమాత్ర మూరకుండుము, క్షణదాచరకోటి గొలువ సమితి సహస్రే
క్షణకాయము గూలిచి భ, క్షణముగఁ జేసెదను భూతసంఘంబులకున్.

415


ఉ.

గాలికిఁ బోవువాహము నగంబులపత్రములం దెమల్పఁగాఁ
జాలును వాలు సైన్యములు సంగరమన్న గృహోపయుక్తముల్
ప్రోలును బట్టబైట నిజపుత్రకుఁడుం బలుగాకి యిట్టిచో
వేలుపుఱేని గెల్చు టొకవిక్రమమే బలిదైత్యవల్లభా.

416


వ.

అని దురాగ్రహగ్రహావేశకిటకిటాయితరదనపటలుం డగుచు నిజభుజాగ్ర
జాగ్రన్మండలాగ్రంబు జళిపించి యాఖండలున కి ట్లనియె.

617


క.

అబ్బలి సురమృగములకుం, బెబ్బులి యటఁ బోకు నీకుఁ బింకం బున్నన్
గొబ్బున రా బలి నే నొక, దెబ్బం బరిమార్తు ధరణిఁ గొబ్బునఁ గూలన్.

418


తే.

నాసురేంద్రుండు నవ్వి యిన్నాళ్లు గావు, నేఁడు బలివైతి వాహవోన్నిద్రబాహు
శక్తికని పల్కి బలికి ద్రాసంబు బలియ, నెలిని ఖండించెఁదను సురల్ బలియుఁ డనఁగ.

419


క.

అంతటఁ బోక సురేశ్వరుఁ, డెంతయు రోషమున వజ్ర మేసిన మూర్ఛా
క్రాంతుం డయ్యెన్ బలి దివి, జాంతకునరదంబు సూతుఁ డవలికిఁ దివిచెన్.

420


సీ.

చెలికానిహాని వీక్షించి రోషంబున జంభుండు కధనసంరంభుఁ డగుచు
నిలు నిలురా యింద్ర నేఁ డెందుఁ బోయెదు చిక్కితివం చని సింహహయముఁ
గదియంగఁ దోలి యుధ్ధతి గదాదండంబు బిరబిరఁ ద్రిప్పి యాసురవరేణ్యు
కరిని వైచిన నది సురసుర స్రుక్కుచు ధరణిపై మ్రొగ్గినఁ దత్క్షణంబు


తే.

నందె మాతలి దెచ్చిన హయసహస్ర, రథముపై నెక్కి జంభుశిరంబు దునిమె
వాసవుఁడు గట్టుదెగఁగొట్టువజ్రమునను, జంభసంభేదమేమి యాశ్చర్య మనఁగ.

421


క.

కలహప్రియుచే నెంతయుఁ, దొలుత న్విని కనలి వానితోఁబుట్టువు
బలపాకనముచు లత్యు, జ్జ్వలశోభాభువనముచులు సంరంభమునన్.

422


క.

త్రేతాగ్నులవలె మువ్వురు, దైతేయులు సుట్టుముట్టి దారుణశరసం
ఘాతములఁ గప్పఁగాఁ బురు, హూతుం డొప్పారె మేఘయుతమేరుగతిన్.

423


క.

బలుఁడు రథంబును దురగం, బులఁ బాకుఁడు సూతు నముచి భూరిశరములన్
దళియించి యింద్రునంగక,ములు సింఛిరి మించి యతఁడు మూర్ఛ మునుంగన్.

424