పుట:Dashavathara-Charitramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కటకట యాడుదానివలెఁ గంజదళాక్షుఁడు సేరి మమ్ములం
దటవటఁ జేసి తీసి యమృతంబు సురాళికిఁ బంచిపెట్టె నిం
కెటువలె నమ్మవచ్చు జగదీశ్వరుఁడే యొకయింత మేరలే
కిటువలెఁ జేయఁజూచె మన కెయ్యది తప్పు గణించి చూడఁగన్.

373


ఉ.

తా నొకమాయఁ జేసి యమృతంబు సురాళికిఁ బంచిపెట్టఁగా
నే నిఁక మాయఁ జేసి త్రిదివేశుల నందఱ మాయఁ జేసెద
న్మానుప శక్తుఁడే యహహ మాధవుఁ డూరక లంజెతక్కులం
బూనెనె కాక యాయుధముపోటు నెఱుంగునె చూత మంతయున్.

374


క.

అని పలికిన దనుజేంద్రునిఁ, గనుఁగొని యిది యెంత స్వామి కనిపించుకొనం
దునిమెదము నీప్రతాపం, బున మే మాసురల నొకనిఁ బోనీకుండన్.

375


క.

తలఁద్రుంపక మ్రింగమె వే, ల్పులందఱ నమృతసేవఁ బొలియకయున్నన్
మెలఁగుదురుగాక కడుపునఁ, గలకాలము జాఠరాగ్నిఁ గమలి బలీంద్రా.

376


క.

అటువలెఁ గాకున్నను మన, పటలిశృంఖలలు వైచి బంధించిన యు
త్కటదురితంబు ననుభవిం, చుటకుఁ జెఱసాల నిడమె సురపతిఁ గినుకన్.

377


క.

అని యుత్సహించి పలికిన, విని దనుజేంద్రుండు మిగుల వేడుక మీఱన్
గనుఁగొని యిదుగో సమయం, బనుపమభుజశక్తి కనుచు నందఱఁ బనుపన్.

378


సీ.

కృతవీరపాణకర్ణేజపభ్రమణారుణాభనేత్రముల రోషాగ్ను లొలుకఁ
గలశాబ్ధిజలఘోషఘనతమాశబ్ది కస్మయఘట్టితాట్టహాసములు చెలఁగఁ
బ్రతిభటాళ్యంధకరణహాలహలదీప్తిముష్టిందయచ్ఛాయమూర్తు లలర
మధ్యేవియర్దీప్యమానార్కనిష్ప్రభీకరణభీకరఖడ్గకాంతు లడర


తే.

హైమరథములఁ దోలి గంధాంధభద్ర, కరుల గారాడి దుముదారుగా హయాళి
జేరువకు నూకి భటులకుఁ జేయి వీచి, యభ్యమిత్రీయదైవసైన్యంబుఁ గదిసి.

379


క.

వాతంధయపాణింధమ, శాతశరము లసురు లేయ సౌరబలంబు
ల్భీతిలక ప్రతిసువర్ణా, న్వీతోజ్జ్వలపత్రితతుల విదలించె వెసన్.

380


మ.

రథికుల్ హస్తికు లాశ్వికు ల్భటులు శస్త్రాశస్త్రిఁ బోరం బర
శ్వథకౌక్షేయకకుంతముద్గరగదాచక్రాదినానావిధా
యుధకాంతుల్ దశదిగ్విభాగములయం దొప్పారె నత్యుగ్రమౌ
మధుభ్ళల్లోచన మాసులోచనము సామ్యంబూని చూపట్టఁగన్.

381


క.

ఈకరణి శరాశరిఁ గుం, తాకుంతి గదాగదిని బ్రతాపము మెఱయ
న్భీకరముగఁ బోరఁగ నా, కౌకోదైత్యులకు ద్వంద్వయుద్ధం బయ్యెన్.

382


సీ.

బలిశక్రులును హేతిపాశాయుధులు వృషపర్వాశ్వినులు రవిబాణు లిందు
సైంహికేయులు విరోచనకృశానులు భద్రకాళినిశుంభులు కాలనాభ