పుట:Dashavathara-Charitramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గందరాంతరసింహగజగండభేరుండశరభాదు లొకటఁ గ్రేళ్లుఱకఁదొడఁగఁ
గంపితశాఖిశాఖాశిఖాఫలపత్రకుసుమము ల్జడిగొని కురియుచుండఁ


తే.

జిఱుతపులితోలుగట్టు జేజేలఱేఁడు, దిరుపుగట్టువిధంబునఁ దిరిగె గట్టు
నవ్యభుజశక్తి దేవదానవులు దుగ్ధ, జలనిధానంబు మథియించుసమయమునను.

204


మ.

కులశైలాగ్రణి క్రింద మీఁద నడుమ న్గూర్మాదిరూపంబులన్
బలియుండై భరియించి దేవదితిభూభాగంబులన్ వారిలో
పలను న్నిల్చి స్వకీయమూర్తిని జతుర్బాహార్గళ ల్మార్పుచుం
గలశాంభోధి మథించె మాధవుఁ డభంగప్రౌఢి రూఢిం గనన్.

205


శా.

ఈరీతిన్ హరి దేవదానవులతో హేలాగతిన్ ధీరుఁడై
క్షీరాంభోధి మథింపఁ గాంచనకటీచేలప్రభ ల్హేమకే
యూరాన్యోన్యవిఘర్షణోదితరజం బుద్వేలసౌవర్ణకో
టీరచ్ఛాయలు పర్వఁ బర్వతము గట్టెం బొమ్మ హేమాద్రికిన్.

206


వ.

అప్పుడు.

207


శా.

రక్షోదేవమిథోట్టహాసహహహారావంబులుం గూర్మమం
థక్షోణీధరమర్షఘర్ఘరనినాదంబు ల్దృణాకర్ష వే
గక్షుభ్యద్భుజగేంద్రభూరిఫణభూత్కారధ్వనుల్ ఘూర్ణితో
ద్యత్క్షీరాంబుధి జంతుఘోషములు మెండై నిండె బ్రహ్మాండమున్.

208


మ.

అఖిలాదిత్యసురాహితభ్రమితమంథానాద్రిఘోషంబుచే
సఖిమై నించుక వెన్నుతీఁట శమియించంజేయ క్షీరాబ్ధిలో
సుఖనిద్రారతిఁ జొక్కెఁ గూర్మపతి ప్రాంశుశ్వాసవాతోచ్చలా
బ్ధిఖవీథిం బొరలం దరంగపటలోద్రేకంబుచే మాటికిన్.

209


వ.

అప్పుడు.

210


మ.

వలదత్యుగ్రదవాగ్ని మగ్నశలభవ్రాతంబుమాడ్కి న్విశృం
ఖలసంఘర్షణభుగ్నభోగిఫణపూత్కారాక్షిదంష్ట్రాగళ
ద్విలయాభీలకరాళకాలదహనోద్వేలజ్జ్వలజ్జ్వాలికా
వళిచే మాడిరి పెక్కుదానవులు గర్వం బెల్ల ఖర్వంబుగన్.

211


తే.

ఘనత యంచును దుష్కరకార్యములకుఁ, బూనఁగాఁ జెల్లునే యెట్టిపురుషులకును
ఘనత యంచును భోగిభోగములఁ బూని, దానవులు పడ్డపా ట్లెన్నియైనఁ గలవు.

212


ఉ.

ఆవిషవహ్నికీలలు సురావళి నంటి తపించునప్డు రా
జీవదళాయతేక్షణవిశేషకృపామృతదృష్టిచేతఁ బా