పుట:Dashavathara-Charitramu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ములు గ్రహించిన నది యాగముగ గ్రహించి, యాగతామర్షమున దైత్యు లనిరి యపుడు.

192


క.

దితిసుతులము పరిపఠిత, శ్రుతులము నిష్ఠురతపోనిరూఢమహోవి
శ్రుతుల మిదిగాక బహు, శ్రుతులము మముఁ జులకసేసి చూడందగునే.

193


తే.

శౌరి మేము కులస్థానపౌరుషముల, నేమిటఁ గొఱంత తెల్పుమా యీసురలకు
వారికన్నను బూర్వదేవతల మగుట, నేమె ఘనులము గామె నీ వెఱుఁగవేమి.

194


ఉ.

శ్రీహరి యెంత యక్రమము సేసితి వాసుకిభోగిభోగసం
దోహము మీరలూని కడతుచ్ఛపుఁబుచ్ఛము మా కొసంగ మే
మూహ యొనర్పలేక యిది యూనిన నధ్యయనశ్రుతంబులు
న్సాహసముం బరాక్రమము సత్కులజత్వము వీటివోవదే.

195


క.

అని దనుజు లూరకున్నం, గనుఁగొని నవ్వుచును శౌరి ఘను లిట మీ రిం
తన యల్గనేల కైకొనుఁ, డని ఫణము లొసంగి పుచ్ఛ మానె సురలతోన్.

196


క.

ఈనీతిసమాకర్ష, స్థానము లేర్పాటు గాఁగ దైవాసురసం
తానంబు లైకమత్యము, గా నమృతాబ్ధి న్మథింపఁ గడఁగిరి కడిమిన్.

197


మ.

అమృతావాప్తికి దేవదానవులు దుగ్ధాంభోధి మంథాద్రిచే
నమితోత్సాహమున న్మథించునెడ నయ్యద్రీంద్ర మాధారహీ
నముగా నజ్జలరాశి మున్గ నదియానం జాలవిస్తారమౌ
కమఠాంగంబు ధరించె మాధవుఁ డభంగప్రౌఢి సంధిల్లఁగన్.

198


తే.

అగశిలాపాత మోర్వక యంబురాశి, చర్మఫలకంబుచే మేను చాటు చేసె
ననఁగఁ జూపట్టె లక్షయోజనవిశాల, మైనకమఠంబు దుగ్ధరత్నాకరమున.

199


క.

కఠినతరకర్పరము మృదు, జఠరము నయనాబ్జయుగళసహబహిరంత
ర్లుఠదాస్యంబును గలుగఁ గ, మఠముం గని విస్మయంబు మదిఁ బెనఁగొనఁగన్.

200


తే.

మరల సొమ్మిచ్చుటకు బహుమధనపడిన, యజ్ఞజునిరోసి పూఁటకా పైనహరిని
జట్టు మోపి రనంగఁ గచ్ఛపముమీఁదఁ, గట్టు నిల్పె సురాసురగణము లపుడు.

201


తే.

ఉదధిఁ గమఠాసనమునఁ గూర్చుండి భోగి, భోగ మనుయోగపట్టిక పొసఁగ నడుమ
నమృతసిద్ధికి జపియించునట్టియోగి, కరణిఁ గనుపట్టె మందరక్ష్మాధరంబు.

202


వ.

ఇవ్విధంబున దుర్ఘటసింధురకందరం బగునమ్మందరవసుంధరాధరంబు వాతంధ
యగుణానుబంధురంబుగా నగ్ఘటసింధుబంధురమధ్యంబునఁ బ్రతిష్టించి.

203


సీ.

శృంగాగ్రదళితవైరించాండగళితావరణధార లననిర్ఝరములు దొరఁగ
నానామహాగుహాంతరసమాధి సనాథతాపసనాథమస్తములు దిరుగఁ