పుట:Dashavathara-Charitramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గపటంబు గాని నిక్కంబుగా దిది నమ్మబోకుఁడి యంచును బాకుఁ డనియె
నామాట నిజమె యీయమరులతో సంధి కీ డటంచును హయగ్రీవుఁ డాడె


తే.

దనుజనాయకుఁ డివియె యోజనలతెఱఁగు, విబుధనాథుండు మానంబు వీటిఁబుచ్చి
కొలువవచ్చెద నన్నను బిలువరాదె, యింతకన్నను బ్రాభవం బేది యనియె.

115


చ.

అన విని విప్రజిత్తి దురహంకృతితో నిదియేటిమాట వృ
త్రుని హితుఁడై వధించె నసితో దితిగర్భము సొచ్చి యింతయు
న్విని వినియుండి యించుక వివేకము లేక సురేంద్రుమైత్రిఁ గో
రిన నగరే నిశాచరవరేణ్య యటన్న బలీంద్రుఁ డిట్లనున్.

116


తే.

ఎట్టివారలు శరణన్న నేలవలయు, వీరధర్మంబు గావున విప్రజిత్తి
కావవలదన్న భీరులఁగాఁ దలంప, రేల యీయోజనలు మానుమింక ననియె.

117


క.

అని నారదముని దెలిపెను, విను మటుగావున నిశాటవిభుఁ డెటులైన
న్నినుఁ దనభృత్యునిఁ జేయంగనె తలఁచినవాఁడు చూడు కార్యం బింకన్.

118


మ.

సమదైరావతకుంభిజృంభితశిరస్సంస్ఫాలనప్రాప్తితో
త్తమసింధూరవిభాతి పాటలితహస్తంబుల్ శయాళుద్యుష
ద్విమతాంఘ్రిద్వయమర్దనంబునను దాదృక్భోణితామ్రేడితం
బమరం గాంచవె యింక నోయమరనాథా యెట్లు సైరించెదో.

119


తే.

దైవగతి యెవ్వరికి దాఁటఁ దరముగాదు, చింత సేయంగవల్వ దావంతయేని
బలికిఁ గప్పంబు లిచ్చుట గొలుచుటయును, న్యాయ మటువలెఁ గావింపు మమరనాథ.

120


క.

అన వెచ్చనూర్చి యవుఁ గా, కని యనిమిషవిభుఁడు దిగ్వరాన్వితుఁ డౌచుం
దనబలములతోడ బలీం, ద్రునిసమ్ముఖమునకు వచ్చి తోరపుభక్తిన్.

121


క.

దేవేంద్రుఁడు హయశతమే, ధావభృథస్నాతపూత మగుమస్తకమున్
దేవాభియాతిపదరా, జీవభ్రమరంబు గాఁగఁ జేసినయంతన్.

122


చ.

ఉరుమణిపీఠి నిండుగొలువుండు నిశాచరనాథుపాదపం
కరుహములందుఁ గోకములకైవడి నంచలరీతిఁ దేంట్లవై
ఖరిఁ దులకించె నిర్జరశిఖామణిమౌళిఁ దనర్చుజాతికెం
పురవలు నిద్దపుందళుకుముత్తెము లెచ్చుకిరీటిపచ్చలున్.

123


వ.

అంత.

124


మ.

సముఖాయంచును వేత్రహస్తులు వచించన్ డిగ్గనం లేచి య
య్యమరారాతి యహార్యవక్షహరణాహంకారి లే లెమ్మటం