పుట:Dashavathara-Charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కప్పులలాశిభర్త హితుఁడౌట కుపాయము సూడఁదీరుగా
కిప్పని నిర్వహింపఁగలరే యన నాయన వజ్రి కిట్లనున్.

94


క.

నిస్సత్త్వుఁడ వీ వతఁ డతి, దోస్సారుఁడు మీకు సంధిదొరకించుటకున్
దుస్సహము “తప్తయో రుభ, యో స్పంధి” యనంగ వినవె యోదివిజేంద్రా.


క.

ఐనను నా చేనగుగతి, నానావిధములను దనుజనాథుఁడు నెయ్యం
బూనఁగఁ జేసెద నని తాఁ, బూనుక చనియెన్ సుపర్వపుంగవుఁ డంతన్.

96


క.

ఒక పర్వతగుహ దిఙ్నా, యకసంయుతుఁ డగుచు గురునియాగమనము సూ
చుక యున్నతఱిన్ శుభసూ, చకములతో గురుఁడు వచ్చి శక్రున కనియెన్.

97


సీ.

అమరేంద్ర నీవంప ననుకంప జనియింపఁ బొలదిండినెలదారిపురము సేరి
వెలిహజారంబున నిలిచి గొల్లలునిల్పఁ బలికి నేవచ్చుట దెలుపుఁడనుచు
నవసరంబులవారి ననుసరించిన వారు సమయంబు గా దని జాగు సేయ
మంత్రుల కెఱిఁగింప మంచిదె యనుటగా కెవ్వరుఁ దెల్ప రదేమొ కాని


తే.

యసురపతి తన్ను రమ్ము పొ మ్మనఁగ నిచ్చ, కములు చేసుక తిరిగెడు గాయకుండు
కలహభోజనుఁ డతనికిఁ దెలియఁ జెప్పి, నన్నుఁ బిలుపింపఁగా నేను నిన్నరేయి.

98


తే.

సమ్ముఖమునకు వచ్చుచుఁ జనుచునుండు, గరుడగంధర్వయక్షరాక్షససుపర్వ
బలము లెల్లెడఁ దొలఁగ ద్రొబ్బఁగవశంబు, గాని కక్ష్యాంతరంబులు గడచి యవల.

99


తే.

మయవినిర్మితనవరత్నమయసభాంత, రమునఁ జెలువొందు భద్రభద్రాసనమునఁ
గనకశైలాగ్రనీలమేఘం బనంగ, నిండుకొలువున్న బలిదైత్యనేతఁ గంటి.

100


తే.

ననుఁ గనుంగొనినప్పుడె వినయమునను, లేచి కూర్చుండు మనెడి నిలింపవైరి
చేరి యాశీర్వదించినఁ జేయి మొగిచి, రమ్ము కూర్చుండు మనఁ డెంతరాజసంబొ.

101


తే.

అపుడు మన నారదుండె నెయ్యంబుమీఱ, రా బృహస్పతి యిందురా రమ్మటంచు
నొదిఁగి చోటియ్య నందుఁ గూర్చుంటి నొదిఁగి, యివ్వలవ్వల దైత్యు లట్టిట్టుఁ ద్రోయ.

102


వ.

అంత.

103


సీ.

బలపాకనముచిజంభపులోమముఖ్యదైత్యులమనివికిఁ జెవియొగ్గి వినుచుఁ
జేరి వినీతి నాశీర్వాద మొనరించు గౌతమాదులను గ్రేఁగంటఁ గనుచుఁ
దనధాటిపదము లందమున విన్పించుగంధర్వుల కుడుగరల్ దయ నొసఁగుచు
నవధారు దేవవేశ్యాభుజంగ యటంచుఁ గంచుకు ల్పొగడ నుత్కంఠ వినుచు


తే.

హరిహరాదులతోఁ బోర నలవిగాదు, మాను మనుశుక్రుతో మఱుమాట లుడిగి