పుట:Dashavathara-Charitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భావికచ్ఛపరూపభావకుం డగువాఁడు శ్రీముకుందాఖ్యచేఁ జెలంగువాఁడు
ఘనసారకుందచందనకీర్తి గలవాఁడు నీలమేఘచ్ఛాయ నెగడువాఁడు


తే.

శ్రీవరఖ్యాతిచే విలసిల్లువాఁడు, శ్రితనవనిధానరీతి వర్తిల్లువాఁడు
నఖిలలోకైకరక్షకుఁ డైనవాఁడు, హరికృపామయమూర్తి ప్రత్యక్షమయ్యె.

74


తే.

ఇట్లు ప్రత్యక్షమయిన సర్వేశ్వరునకు, నవని సాష్టాంగ మెరఁగి బ్రహ్మాదిసురలు
నిర్భరానందమగ్నులై నిలిచియున్న, వారిఁ గనుఁగొని యాదానవారి యనియె.

75


సీ.

ఒకముఖంబున సృష్టి యొడఁగూడదే విచారమున వచ్చితి వేమి కమలగర్భ
ధరణి భైక్షం బెందు దొరకదాయెనె చిక్కి సగమైతి విది యేమి చంద్రమౌళి
వేయిభంగులను గావించె దాలోచన క్రమము స్వాస్థ్యము లేదె ఖచరనాథ
దెసల నొందినయట్టి తీరు గానఁగవచ్చెఁ బలుకాడ రేమి దిక్పాలురార


తే.

పెక్కువగ లొందెద వదేమి బిసరుహాప్త, చిన్నపోయెద వది యేమి శీతకిరణ
యితర సుమనస్సులార మీ రిటులు వాడి, యుండ నేటికి నామోద ముడిగి యనిన.

76


తే.

అంబురుహగర్భుఁ డనియె లోకైకనాథ, సహజమే సృష్టి యేమియు సాగనీక
బలి నిలింపులనెల్లఁ బంపంగఁ దొడఁగెఁ, గించిదవశిష్టమయ్యె స్వర్గికుల మనిన.

77


క.

ధననాయకసఖుఁ డిట్లను, వనజోదర భైక్ష మేది వసుధాస్థలిలో
జన మెల్ల బలిరుషాభా, జనమయ్యె న్నిక్క మనిన శక్రుం డనియెన్.

78


తే.

స్వాస్థ్య మెయ్యది జలజాక్ష శక్తి మెఱసి, నాఁడె స్వర్గంబు గైకొనినాఁడు బలియె
యెన్నిభంగులఁ దలఁచిన నేమి గలదు, స్వామివారికృపాకటాక్షంబు లేక.

79


తే.

అనినఁ దక్కినదేవత లనిరి భక్తి, జైత్రగతి మించ వైరి మాజాతి కెట్లు
గలుగు నామోద మింకిట ఘనుఁడవైన, నీకృపామృతవర్షంబు లేక శౌరి.

80


తే.

అనిన విని వారిజోదరుఁ డాదరమునఁ, గలిమి బలిమిని నీకు లోకములయందు
నీడుజోడును లేదుగా యింద్ర యేల, పలుకనోడితి వన వజ్రపాణి పలికె.

81


క.

సర్వేశ్వర వినిపించెద, సర్వము విన నవధరింపు సంపద లెల్లన్
దుర్వారతరదురాగ్రహ, దుర్వాసశ్శాపమునను దోయధిఁ జేరెన్.

82


తే.

కాన నిశ్రీకమైన నాకంబునందు, నిర్వహింపఁగ లేనైతి నీరజాక్ష
కలిమి సాలనివారికి బలిమి గలదె, యింక నెయ్యది బుద్ధి సర్వేశ యనిన.

83


క.

ఔనోయి యింద్ర నాయెద, పైనుండెడు రమను గానఁ బ్రణయపుటలుకం
బూని యెటు నిల్చెనో యని, యేనుండితిఁ గాన జలధి కేగుట యెఱుఁగన్.

84


ఉ.

అక్కట లక్ష్మిఁ బాసి క్షణమైనను నేను వియోగవేదనం
జిక్కఁగలానె యెట్లయిన శ్రీతరుణీమణి వచ్చునట్లు గా
నొక్కయుపాయ మెంచవలె నూహ యొనర్చితి లక్ష్మిరాకకున్
గ్రక్కున వేల్పులెల్ల నమరత్వముఁ బొందుటకున్ సురోత్తమా.

85


తే.

కవ్వముగఁ జేసి మంధరక్ష్మాధరంబు, వాసుకినిఁ ద్రాడు చేసి దుర్వారశక్తి