పుట:Dashavathara-Charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అతులంబై తగు బ్రహ్మవర్చ సము డాయన్రామిఁ బొంచున్నచో
నతివేలాయితనాసికానుషిరయాతాయాతనిశ్వాసమా
రుతసంక్షుబ్ధచతుర్ముఖంబులను మూర్తు ల్దాల్చి వేదాళిని
స్రుతయైనన్ హరియించె దక్షణమ రక్షోభర్త విభ్రాంతుఁడై.

272


సీ.

హీరకుట్టిమభూము లిసుకనేల లటంచు గట్టఁగా నడుగులు పెట్టవెఱచుఁ
బచ్చరాకట్నంబు పచ్చికపట్లని వెడవెడ మునివ్రేళ్ల నడచిపోవు
నిలువుటద్దంబుల నీడలు పరికించి పరులంచుఁ జేకత్తి పదిలపఱుచుఁ
దానువచ్చినతోవ గానక తలబొప్పిగట్టిఁగాఁ గుడ్యభాగములఁ దాఁకుఁ


తే.

దడఁబడుచు నిద్రపోయెడి తలిరుఁబోండ్ల, పాదముల మెట్టుఁ గాని మున్పంటిధైర్య
మూనలేఁడయ్యె విను మెంతవానికైన, దొంగతన మన్నయప్పుడె దొడరుభయము.

273


మత్తకోకిల.

అంత నొక్కక్రమంబునం దనుజాధినాథుఁడు భారతీ
కాంతుకేళిగృహంబు వెల్వడి కంధిగర్భముఁ జేరఁబో
నెంతయు న్మొఱవెట్టె వేదము లీశ్వరా మము దేవతా
హంతచేఁ బడకుండఁ బ్రోవవె యంచు బెట్టుగ భూవరా.

274


తే.

అప్పు డచ్చెరువందుచు నంబురాశి, దరినినుండెడి సప్తర్షివరు లిదేమి
యార్తనాదంబొ కపటమీనావతార, తేటతెల్లమిగా మాకుఁ దెల్పవలయు.

275


ఉ.

నావుడు శాంబరీశఫరనాయకుఁ డిట్లను మౌనులార వా
ణీవిభుఁ డిఫ్డు మైమఱచి నిద్దుర వోవఁగఁ జూచి యాహయ
గ్రీవుఁడు చోరవృత్తిని హరించి తముం గొనిపోవుచుండఁగాఁ
గావఁగ దిక్కు లేమిఁ గడఁక న్మొఱవెట్టఁదొడంగె వేదముల్.

276


ఉ.

కావున మ్రుచ్చురక్కసునిఁ గ్రక్కున నొక్కట నుక్కడంచి వే
దావళి నుద్ధరించి క్షణదాంతవినిద్రితుఁడైన బ్రహ్మ కీఁ
బోవలెనంచు మించుజలమున్ బలముం గలముం బయోధి నెం
తేవడి మీఱడించి దురతిక్రమవేగపరాక్రమంబునన్.

277


మ.

సమయాంభోనిధిఁ జొచ్చి చండతరచంచద్వాల మల్లార్చుచున్
సమరోజ్జృంభితజంభశాసన భుజాస్తంభాగ్రదంభోళి దు
ర్దమశృంగంబున వేదచోరపురవప్రశ్రేణికల్ నుగ్గునూ
చముగాఁ దాఁకె సుధాశనాసహనయోషాగర్భనిర్భేది యై.

278


మ.

అటులం దాఁకిన యంత దంతికరలూనాబ్జంబు చందంబునన్
స్ఫుటితం బైనపురంబు వేవెడలి రక్షోవీరు లీక్షించి యె
చ్చొటలే దిట్టికడానిచోఱ యిది గొంచుంబోయి చేకాన్కగా