పుట:Dashavathara-Charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నేను న్నీ వనుటయె య, జ్ఞానం బందుననె గలిగె సంసృతియా య
జ్ఞానము దెగ నదియుం దెగు, జ్ఞానము సమకూరు మోక్షసౌఖ్యము దొరకున్.

220


క.

విను మిది రజ్జువు ఫణిగా, దని తెలిసిన భయము నుడుగు నటువలె జీవుం
డనుగాను బ్రహ్మ మని తెలి, సిన నిర్భయుఁ డగుచు ముక్తిఁ జెందు నరేంద్రా.

221


క.

విను బ్రహ్మానందము తెలి, సినవాఁ డెందులను భయముఁ జెందఁ డనంగా
వినవే శ్రుతివాక్యంబుల, ననఘా తత్ప్రీతిఁ జెంద నర్హము గాదే.

222


సీ.

బహుజన్మముల సాధుపరిచర్య చేసినఁ బుణ్యపురాణార్థముల నెఱుంగుఁ
బుణ్యపురాణార్థముల నెఱింగినయంత సత్కర్మ మెప్పుడు సలుపుచుండు
సత్కర్మ మెప్పుడు సలుపుచునుండిన మత్పాదభక్తి యాత్మను జనించు
మత్పాదభక్తి యాత్మను జనించినమాత్రఁ గొనసాగి జ్ఞానంబు కుదురుపడును


తే.

జ్ఞానమునఁ బూర్వకర్మసంచయము లెల్లఁ, దీఱు నప్పటికర్మము ల్ద్వేషహితుల
కగును బ్రారబ్ధ మనుభూతమగుచుఁ దెగిన, జనుఁడు గైవల్యసామ్రాజ్యసౌఖ్య మొందు.

223


తే.

అని మఱియు సాంఖ్యయోగక్రియాదిబోధ, సాధకం బైన సపురాణసంహితాక్ర
మము సవిస్తరముగ సంశయములు దీఱ, యముల కెఱిఁగించుచున్న యయ్యవసరమున.

224


శా.

అబ్రంబైన భుజాబలద్రఢిమ వాహగ్రీవుఁ డత్యంతసు
ప్తబ్రహ్మాస్య సమీరనిస్సృతములౌ తమ్ముం బ్రమోషించి య
య్యబ్రాశిం జొఱఁబారుచో శ్రుతులు హాహాకారము ల్మీఱఁగా
నబ్రహ్మణ్యము వెట్టినం గపటమత్స్యం బేగెఁ దద్రక్షకున్.

225


సీ.

కమలజాతభవాండకర్పరం బొరయంగ మెఱుఁగుబంగరుచాయమేనిఁ బెంచు
బిరుదువజ్రపుగండపెండారమై మీఱుకొమ్మున శేషాహి గ్రుచ్చి యెత్తు
దిక్కుంభికుంభము ల్వ్రక్కలై ముక్తాఫలములు పై కెగయ వాలమునఁ గొట్టు
బడబానలము దపింపఁగఁ జేయు రూక్షవీక్షణముల విస్ఫులింగములు దాల్చు


తే.

భావిమంథమహీధరభ్రమణరీతిఁ, దెలుపుపొలుపున గిరగిరఁదిరుపుగట్టు
నబ్ధి నేకాంతలీలావిహారలోలుఁ, డైనహాటకకపటపాఠీనవిభుఁడు.

226


క.

అని తెలిపిన వైశంపా, యన శమధనలోక నిర్జరాధిపుతోడన్
జనమేజయవిభుఁ డనియె, న్వినయము రెట్టింప మిగుల విస్మితుఁ డగుచున్.

227


శా.

ఓవాచంయమిచంద్ర సంద్రములు నేఁ డొండైనవేళన్ హయ
గ్రీవుం డెక్కడనుండె నేకరణిఁ జేరె న్సత్యలోకంబు రా