పుట:Dashavathara-Charitramu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యవల వలమానజనంబులవలన లలనాసమేతుండై శృంగారవనంబున కరుగుట
విని యద్దేవునిరాకకై యుద్యానవనవాటికాద్వారంబునఁ గైరవాప్తుం దృణీక
రించు నిగనిగని మగఱాల వెన్నెలగనియగు తిన్నెలు గని వసియింప నెంచు
నవసరంబున.

16


తే.

చెలువ యొక్కతె వచ్చె నాచెలువఁ జూచి, కమలయంచును భ్రమసిరి యమరు లెల్లఁ
గనకవేత్రంబుఁ గని దాదిగాఁ దలంచి, యుండి రాఖండలాదు లయ్యువిద యంత.

17


క.

హరుని వచోయువతిమనో, హరునిఁ బులోమాసురేంద్రహరునిన్ గురునిన్
హరి రమ్మనియె నటన్నన్, హరుసముతో వారు నలువు రతివినయమునన్.

18


మ.

చని వీక్షించిరి భూమి నీళ మొదలౌ చంద్రాస్య లంతఃపురం
బున కేఁగం గమలాలతాంగి యెదపైఁ బొల్పొందు మాల్యంబుచా
టుననిల్వన్ ఫణిరాజపీఠమున నీటుల్గుల్కఁ గొల్వై ఖగేం
ద్రునిచేత న్మడుపందు మందరధరున్ లోకైకరక్షామణిన్.

19


క.

కని మ్రొక్కినఁ గనికరమునఁ, గని కరమున లేవనెత్తి కఱుకంఠుం జెం
త నుచితపీఠి వసింపం, బనిచె నిలుచుండి రెదుట బ్రహ్మేంద్రగురుల్.

20


తే.

చంక చేతులు వెట్టుక సవినయముగఁ, గెలన నిలుచున్నవారి నీక్షించి శౌరి
మీరు గూర్చుండుఁడని పలుమాఱుఁ బలుక, నుచితవైఖరి వారుఁ గూర్చుండి రంత.

21


క.

ఏమీ వచ్చిన కార్యము, కామారి యటన్న ముకుళకరకమలుండై
స్వామి యెఱుంగనికార్యము, లేమున్నవి త్రిపురదైత్యు లెచ్చి రటన్నన్.

22


శా.

స్నానంబున్ జపముం దపంబు గ్రతువు ల్స్వాధ్యాయము ల్దేవతా
ధ్యానంబున్ మొదలౌ ధరిత్రి గలశ్రుత్యాచారము ల్దప్పి రిం
తైనన్ దానన చేసి దానవు లజయ్యత్వంబున న్మించి ర
ట్లైనన్ సత్యము శౌచమున్ దయయు లే వావంతయున్ శంకరా.

23


సీ.

చంద్రశాలలయందు సంపూర్ణ చంద్రుని గన్నులకింపుగాఁ గాంచుటకును
వైడూర్యమయసౌధవాతాయనంబుల సూర్యకరాళి మై సోఁకుటకును
సురతాంతతాంతలై సురపొన్న వీచిన సురభిమారుతములఁ జొక్కుటకును
శీతకాలంబుల శ్రీచందనహసంతికాహుతాశను సెగఁ గాంచుటకును


తే.

భయపడుదు రన్నఁ గలనైనఁ బరులఁ దలఁప, రనుట సువ్యక్తమగుఁ గదా యసురవరుల
కట్టిపరమపతివ్రత లాండ్రు గాఁగ, నెట్లు వారల గెలువనౌ నెవరికైన.

24


తే.

అదియునుం గాక యలతారకాక్షసుతుఁడు, హరవిరించులగుఱిచి యత్యద్భుతముగఁ