పుట:Dashavathara-Charitramu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

శ్రీరామచంద్రుఁడు చేపట్టఁడాయెనా శరణుఁజొచ్చిన విభీషణునిఁ దొల్లి
శిబిచక్రవర్తి రక్షింపఁడే మును దన్నుఁ జేరినపక్షి దాక్షిణ్యగరిమ
నచ్ఛభల్లముఁ బ్రోవఁడా తొల్లి బెబ్బులిపాలుగాకుండ నృపాలసుతుఁడుఁ
దనశరీర మొసంగి వనచరునొక్కని దయగావదే కపోతంబు దొల్తఁ


తే.

గాన శరణాగతులఁ బ్రోచుకంటెఁ బుణ్య, మేది మేదినిలోన నన్నేది యింక
నాదిరాజన్యకీర్తులఁ బ్రోది సేయు, ధర్మగుణసాంద్ర సత్యవ్రతక్షితీంద్ర.

134


క.

సకలం బెఱిఁగినయాదిమ, శకులం బటులనిన రాజచంద్రునిచిత్తం
బకలంకమయ్యు నించుక, వికలముగా నిట్టులను సవిస్మయుఁ డగుచున్.

135


మ.

శరణన్న న్విడ నిన్ను నేను శఫరీ సామాన్యబుద్ధి న్నిరా
దరతం ద్రోచితి వేళగామి నిదియే తప్పంచు నీ వెంచి ని
ష్ఠురతం బల్కితి పాడియే దెలుపుమిచ్చో నేభయంబయ్యె న
న్శరణొందం బనియేమి నావలన రక్షాసిద్ధి నీకెట్లగున్.

136


తే.

అనుచుఁ బలికిన జనపతి మనుచు వేడ్కఁ, బెనుచువాలుగ మేలుగాఁ గనుచు ననియె
నుదకమునఁ దత్తరింపుచు నున్న నన్నుఁ, జూచి భయమేమి యనుటగా చోద్య మయ్యె.

137


సీ.

కూర్మికిఁ గూర్మి చేకుఱునె నోరికిఁజిక్క నెగడుము న్నెగడుపై నెగడుచుండ
మొసలికి మొసలియే దెసలఁ జేరఁగరాదు పాముల బాములఁ బడుట కడిఁది
కరటి మర్కటి గాదె పట్టినచోటు గప్పలు గొప్పలు గలవు మ్రింగ
బకము లంబకము లెప్పటికి మాపై నిల్పు మీలముచ్చులు ముచ్చు లేల విడుచుఁ


ఆ.

గన్నతల్లి కన్నఁ గరుణలే దొకవేళఁ, బట్టిపట్టిఁ తివియుఁ బార్థివేంద్ర
గండకముల కిట్టిగండము ల్గలవిఁకే, మనఁగవచ్చు నెట్లు మనఁగవచ్చు.

138


తే.

అటులుగాన నిరంతర ప్రాప్తశైత్య, తరళతరవారిధార సాదనలు సేయు
మీనుపిల్లలజన్మంబు మే లనంగఁ, బడునె పరికింప విషములో బ్రతుకు గాదె.

139


క.

కాన నిరుపద్రవంబగు, చో నను విడిపించి తేని సులభముగాఁ జే.
కోనగు నాచంద్రార్కం, బైనసుకృత మనిన నృపతి యతివత్సలుఁ డై.

140


తే.

అధికనైష్ఠికవృత్తి మన్మథునిఁ గెలిచి, డాలుగైకొన్న జోళమండలవిభుండు
డాసి యన్నది యుదకమండలములోనఁ, దలఁకు మీనంబుఁ దనకమండలము సేర్చి.

141


సీ.

తనయాశ్రమమున కల్లనఁ దెచ్చి రాజర్షివల్లభుఁ డాశ్రమమెల్లఁదీఱ
సతతపయోధార సమకూర్చి భూమిలో నేఁటఁ బెంచినవారిఁ బూఁట బెంచె
ననుమాట నిజముగా నెనరుతోఁ బోషింప శిశుక మారాత్రిలోఁ జిత్రముగను
బలిసి భూమండలాఖండల కొండిక కుండికనుండఁగూడ