క. |
ఈరామాయణకథ యె, వ్వారు పఠించినను వినిన వ్రాసిన సౌభా
గ్యారోగ్యభాగ్యయుతులై, వారలు వెలయుదురు సుమతి వసుమతిలోనన్.
| 202
|
క. |
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెలుప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.
| 203
|
శా. |
శ్రీరాగోజ్జ్వలగేహ తోయజదళాక్షీమోహనాదానవ
త్సారంగప్రవరాళిపార్శ్వనినదద్ఘంటీరవప్రాంగణా
సౌరాష్ట్ర ప్రియశంకరాభరణరాజత్ప్రజ్ఞకేదారకా
శ్రీరామేశ్వరధీరమధ్యలలిత శ్రీదాభిరామక్రియా.
| 204
|
క. |
పూర్వోత్తరమీమాంసా, పూర్వోత్తరవినుతసమరభూసాహసితా
పూర్వోత్తరసారథిరథి,పూర్వోత్తరరాజమిత్ర భూరిధనాఢ్యా.
| 205
|
స్రగ్విణీ. |
చంద్రకాంతోన్నమత్సౌధయూథక్రమా
చంద్రకాంతోపలాంచద్యశశ్చక్రమా
చంద్రకాంతోపమానన్ముఖాబ్జక్రమా
చంద్రకాంతోత్తమాశ్వస్ఫురద్విక్రమా.
| 206
|
గద్య. |
ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు సప్తమాశ్వాసము.
|
|
7. శ్రీరామావతారకథ సమాప్తము.