పుట:Dashavathara-Charitramu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్గొనినంతం జను బ్రహ్మహత్య మొదలౌ క్రూరాఘసంఘంబు మ
జ్జనముం జేసినవారి పుణ్య మెఱుఁగన్ శక్యంబె మాబోంట్లకున్.

180


తే.

అంత రఘువల్లభుఁడు పుష్పకాధిరూఢుఁ, డగుచుఁ గిష్కింధత్రోవఁగా నరిగి రవిజ
సతుల రప్పించి సీతపార్శ్వముల నిలిపి, జనకనందనతో నిట్టు లనియెఁ జనుచు.

181


సీ.

పంపానదినిఁ గంటె శంపాలతాతన్వి ఋశ్యమూకముఁ గంటె ఋష్యనయన
శబరీవనముఁ గంటె శబరీజితఘనాళి దండకఁ గంటె వేదండయాన
పర్ణశాలలఁ గంటె స్వర్ణభాసురవర్ణ ఘటజాశ్రమముఁ గంటె కుటజగంధి
చిత్రకూటముఁ గంటె చిత్రశాలికపోల గంగఁ గన్గొంటివె భృంగచికుర


తే.

యనుచుఁ దెల్పుచు వచ్చి యయ్యనిలసుతుని, బిలిచి తమరాక భరతుతోఁ దెలుపఁబంచి
ఘనభరద్వాజుఁ గనఁ బ్రయాగమున నిల్చి, యాతఁ డొనరించు మంచివిం దారగించి.

182


వ.

ప్రభాతసమయంబునఁ బ్రభావతీప్రభాతరంగితపుష్పకాభిరాముండై భరద్వాజ
సమాసాదితభోజనానందిగ్రామసమేతంబుగా రామచంద్రుండు నందిగ్రామంబు
నకుఁ జనుదెంచునప్పుడు నెదురుగా సకలసేనాపరివృతుండును శత్రుఘ్నసేవి
తుండును గౌసల్యాదిజనయిత్రీసహితుండును నైన భరతుండు కృత్యాచార
తరంగిణీరోధఃపురోధఃపురస్సరంబుగా నరుగుదెంచినం జూచి రఘువీరుండు డిగ్గు
న లేచి సుగ్రీవుకైదండ గొని విభీషణపురోనిర్దిష్టమణిసోపానమార్గంబునఁ బుష్ప
కంబు డిగ్గి వసిష్ఠునకు వందనం బాచరించి వందమాను లగు భరతశత్రుఘ్నులఁ
గౌఁగిలించికొని తల్లులకుం బ్రణమిల్లి తదీయానందబాష్పధారానేకంబు చిరా
ద్భావిపట్టాభిషేకసంసూచితంబుగా సంతసిల్లి నందిగ్రామంబు ప్రవేశించి భరత
పూర్వకంబుగా సుమిత్రాపుత్రులతో జటావల్కలంబులు సడలించి పతంగనందన
దనుజపుంగవాదిపురోహితసహితంబుగా నభ్యంజనస్నానంబు చతుర్విధశృం
గారంబు లంగీకరించి మణిమయశతాంగం బెక్కి సుగ్రీవాంగదవిభీషణాదులు
మాతంగతురంగాదివాహనారూఢులై కొలిచిరాఁ బురాంగనలు సేసలు చల్ల
వందిమాగధులు వొగడఁ బంచమహావాద్యంబులు బోరు కలుగ మహోల్లాసంబున.

183


సీ.

అల మేరువును బోలి యందంద నందమై కురుజులు మేరువు ల్గొమరుమిగుల
గలువడంబులలోన యలజవ్వనపుమిటారులచూపు కలువడంబులు ఘటింపఁ
గలయ నెల్లెడ వణిక్కులదీపములవాకిళులయందు మణిదీపములు వెలుంగ
మకరతోరణము లంబరమార్గమకరతోరణవిచక్షణములై రాయడింప


తే.

రహి వహించు నయోధ్యాపురంబు సొచ్చి, తననగర లక్ష్మణునియింటఁ దపనసుతవి
భీషణుల నన్యులను నన్యపృథులరత్న, గేహముల నుంచి తా రాజగృహము చేరి.

184