పుట:Dashavathara-Charitramu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

పరితఃకీర్ణకచావృతాంసము గళద్భాష్పంబు సిక్తస్తనాం
తరచేలంబుఁ బతద్విభూషణము హానాథేతివాగాస్య మ
త్యురునిశ్వాసవిశోషితాధరము శోకద్విగ్నచిత్తంబు నై
యరుదెంచెన్ రణభూమిఁ జేర దశకంఠాంతఃపురం బయ్యెడన్.

171


క.

అరుదెంచి వరునిపైఁ బడి, పొరల విభీషణుఁడు వారి బోధించి ధరా
వరునాజ్ఞఁ బంక్తిముఖునకుఁ, బరలోకక్రియలు దీర్చి పావనుఁ డైనన్.

172


శా.

యావత్కాలము భూమి రాముకథ సూర్యాచంద్రముల్ వారిధుల్
తావత్కాలము లంక నేలు మని తాత్పర్యంబుతో రామసం
సేవాలోలు విభీషణున్ సుగుణరాశిన్ నిల్పె సౌమిత్రి సీ
తారామాహృదయేశజంగమజయస్తంభంబునా నంతటన్.


మ.

తళుకున్నిద్దపుఁబైఁడిబొమ్మవలె సీతాకాంత పెంజిచ్చుని
చ్చలపుంగాఁ కలవన్నెవాసి గని మించం గాంచి హర్షించుచుం
గులకాంతామణి చెంత నుంచుకొనియెం గోదండదీక్షాగురుం
డలఘుప్రౌఢవచోనిరూఢిఁ దగ బ్రహ్మాదు ల్ప్రశంసింపఁగన్.


వ.

అంత.

175


తే.

దశరథుని గాంచి మ్రొక్కి యింద్రవరమునను, బలము బ్రతికించి పురి కేఁగఁదలచురాము
నకు విభీషణుఁ డొసఁగె సాంద్రప్రఫుల్ల, పుష్పకంబైన కౌబేరపుష్పకంబు.

176


క.

రతివలెఁ గామగమనమయి, వితతంబగుపుష్పకము బ్రవేశించి చమూ
తతితో సతితో ధృతితోఁ, బతితోరపువేడ్క రాజపథగతుఁ డగుచున్.

177


సీ.

అదె చిత్రమకరాంకహయవిచిత్రవిటంకవసతిలగ్నశశాంక యసురలంక
సకలలోకములందు జయలక్ష్మినేఁ జెందఁ గుంభకర్ణుం డిందుఁ గూలె ముందు
మనలక్ష్మణునితోడ మల్లాడి మదమూడి శక్రు గెల్చినప్రోడ సమసె నీడ
నట వ్రాలె బటుదండుఁ డైయుండు మును నిండురాజసంబున నుండురావణుండు


తే.

సేతు వదె యంచుఁ దెల్పుచు సీతతోడ, రామచంద్రుఁడు రామేశ్వరంబు చేరి
తనదుపేర సమీరణతనయుపేర, దివ్యలింగంబు లఁటఁ బ్రతిష్ఠించి కొలిచి.

178

వ్యోష్ఠ్యాచలజిహ్వాద్వ్యక్షరీకందము

భవభావిభవవిభావా, భవభావభవాభిభావభావీభూభా
భవభావభావివైభవ, భవభావిభుభావివిభువభావావిభవా.

179


మ.

అని వర్ణించి విభుండు సేతువు శరాసాగ్రంబునం ద్రుంచె శే
షునకైనం బొగడంగ శక్యమె ధనుఃకోటిప్రభావంబు గ