పుట:Dashavathara-Charitramu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తనసహోదరున కిత్తఱి నెద్దిగతి యంచుఁ దల్లడించుచు గౌరి ధవుని వేఁడెఁ
[1]గద్రువపుత్రశోకంబు నేగతి మాన్ప నగునంచుఁ గశ్యపుఁ డడిగె నజునిఁ
దనపౌత్రుఁ డేమి యయ్యెనొ బలీంద్రుఁ డటంచుఁ బ్రహ్లాదుఁ డెంతయుఁ బలవరించె
గిరికొనుచింతచేఁ గిటికూర్మరూపము ల్సంహరింపఁదొణంగెఁ జక్రపాణి


తే.

నీశరాగ్నులు నానీరు నీఱుఁ జేసి, మీఱి పాతాళలోకము ల్దూఱునవుడు
లోకసంరక్షణైకలోలుండ వయ్యుఁ, దగునె నీ వింత సేయ సీతాసహాయ.

119


తే.

అని నుతులు చేసి మరుభూమి నజునియాశు, గంబుఁ బఱపించి సేతుబంధంబునకును
నలుని నియమించి చనియె నజ్జలధి నలుఁడుఁ, గపులు దెచ్చిన గిరులచేఁ గట్టునపుడు.

120


మ.

ఒకచేఁ బట్టెఁడు నెంతగట్టు నితఁడం చుగ్రాత్ముఁడై గంధవా
హకుమారుం డట నుత్తరంబు గన దేవాహార్య మేలంచు భూ
మికుమారీవరుఁ డన్న వద్దనఁగ నేమీ తెచ్చుఁగాకంచు ను
త్సుకుఁడై కట్టె నలుండు వారధి సురస్తోత్రైకపాత్రంబుగన్.

121


మ.

మును సుగ్రీవునకు న్విభీషణునకున్ మోదంబుతోఁ బట్టముం
దనుఁ జేరంగని కట్టెనంచును సముద్రంబుం దనుంజేర శో
భనలీల న్ఫువనాధిపత్యమునకుం బట్టంబుఁ దాఁ గట్టెనో
జననాథాగ్రణినాఁగ సేతు వమరెన్ సాముద్రగోధిస్థలిన్.

122


మ.

హరిసంఘంబులు గొల్చిరా సరసవాతాపత్యసంరూఢుడై
ఖరశత్రుం డసమాస్త్రరీతి వెలయం గామాతురుం బఙ్క్తికం
ధరు నంత్యోగ్రదశార్తుఁ జేయుటకు దోర్దర్పంబునన్ దైత్యరా
ట్పురముం జేరెను హంససంతతి నతు ల్వొంగార శృంగారియై.

123


వ.

ఇవ్విధంబున రఘునాథుండు పాథోనిధానంబుం దాఁటి యనేకబలజాలంబులతో
సువేలనగరంబునఁ బాళెంబు డిగిన శుకసారణులు వచ్చి చూచి చని రామ
లక్ష్మణసుగ్రీవమహాబలనందనాదిబలంబుల వేఱువేఱ విన్నవించిన విని నిశిత
క్రూరకటాక్షంబుల నాక్షేపించుచు జిహ్మగమనద్విజిహ్వుని విద్యుజ్జిహ్వునిం
బిలిచి మాయ సేయ నియోగించి యద్దురాత్ముండు వద్దురా రావణా యనక
కుహనారఘూద్వహుని శిరంబును సశరాసనశరంబునుంగాఁ దెచ్చి సీతముంద
ఱం బడవైచినం జూచి యుల్లంబునఁ దల్లడిల్లి పెల్లడలు పుడమిపట్టికి నవి కల్లలని
తెల్పు సరమవాక్యంబుల సముల్లాసరమం గాంచి యుండె నంత.

124


చ.

ఇనకులుఁ డాసువేలగిరి నెక్కి కనుంగొనఁ బైఁడిమేడపైఁ
బనివడి కుంచెగిండి యడపంబును బావడ లూని వేల్పుజ

  1. గద్రువపుత్రశోకము మాన్ప ననువెయ్య దనుచుఁ గశ్యపుఁ డజు నడుగఁ జనియె.