పుట:Dashavathara-Charitramu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

భార్గవుఁడు పెక్కునాళ్లు తపంబువలనఁ గూర్చు స్వర్ణోకములనెల్ల గూల్చె నొక్క
కోలఁ 'గుమ్మరి కేఁడును గుదియ కొక్క, పె'ట్టటంచును బల్కఁగాఁ బృథివి వినమె.

303


తే.

జామదగ్న్యుండు విష్ణుతేజంబు సనిన, రామచంద్రనృపాల మార్తాండు దండఁ
జందురుఁడుపోలి కనుపట్టె సవినయముగఁ, దొలఁగెఁ దా మున్ను వచ్చిన త్రోవఁ బట్టి.

304


తే.

సకలజనము సెలఁగె జానకీకల్యాణ, వేళకన్న రామవిజయలక్ష్మి
కలసియున్న రాముఁ గాంచి సీతయు మెచ్చె, సవతిమత్సరంబు సతికిఁ గలదె.

305


వ.

అంత.

306


మ.

జనకుండు జనను ల్సహోదరులుఁ దజ్జాయ ల్మునిజ్యాయలున్
జననాథు ల్హితులుం బురోహితవరు ల్సైన్యంబు లేతేరఁగా
జనకక్షోణివరాగ్రగణ్యసుతతో శత్రుంజయారూఢుఁడై
తనసాకేతపురంబు సొచ్చె రఘునాథస్వామి హర్షంబునన్.

307


సీ.

అకలంకమణికంకణకళంకరహితేందుమహితాస్య లుభయచామరలు వీవ
నుడిగంవువిడికెంపుపొడికెంపునునుమోవిపడఁతులు వన్నెపావడలు వైవ
మరుదధ్వచరదధ్వబిరుదధ్వజచ్ఛాయ నేలకు నీలి బూర్ణీసు గాఁగ
నెలవంకవలవంక నలశంకరకుమారుఁ బ్రతిఘటింపఁగఁజాలు భటులు గొలువఁ


తే.

బౌరవారిజముఖులు సొం పౌర యనుచు, సేసకొప్పులు గదలంగ సేసఁ జల్ల
రామభూజాని జూనకీరామతోడ, నగరుచిరసౌధ మగుతననగరు సొచ్చె.

308


వ.

అంత.

309


సీ.

చికిలికెమ్మోవికెంజిగురు మిటారింప దంతకోరకము లందంబు గాఁగ
మవ్వంపుఁజిఱునవ్వుఁబువ్వు నివ్వటిలంగఁ బొదలు వాల్చూపుతుమ్మెదలు మెదలఁ
గలకలఁ గోయిలపలుకులు చెలరేఁగఁ గలితనాసాచంపకము దనర్పఁ
జెన్నుగాఁ బొక్కిలి పొన్నక్రొవ్విరి మించ గుత్తంపుగుబ్బపూగుత్తు లలరఁ


తే.

బ్రథమఋతుమతి యయ్యె ధరాతనూజ, శుభదినంబున నంతట శోభనంబు
సేసి రారేయి రఘుపతి చిత్తజాత, కేలికాలోలుఁడై కేళిగృహమునందు.

310


చ.

పగడపుఁగోళ్లుఁ గుందనపుఁబట్టెలు గుజ్జరినేఁతపట్టెయం
చగరులపాన్పు జాజివిరిశయ్య దుకూలము పై తలాడలున్
జిగిదళుకొత్తు చప్పరము చెందొవ క్రొవ్విరిచందువాలతా
విగలిగిమించు మంచమున వేడుక శ్రీరఘురాముఁ డున్నెడన్.

311


సీ.

తళుకుముత్యపుకొప్పు వలనిగ్గు మదబంభరాళికి విరిగుత్తియాసఁ గొలువఁ
జుఱుకుకెంపులకమ్మమెఱుఁగు వేఁ జెక్కులఁ గుంకుమమకరికల్ గుదురుకొలుపఁ