పుట:Dashavathara-Charitramu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నవమణిమయభూషణముల, నవనిజఁ గైచేసి రప్పు డతివలు మిగులం
దొవరాయల్లుని కెంజిగి, చివురాకుంబాకు చికిలిచేసినమాటిన్.

244


తే.

జగము గెలువఁగ నొకయమ్మె చాలుననుచుఁ, గడమనాల్గమ్ములను రాజకన్యలుగను
రతిపతి సృజించె రఘుకుమారకుల గెలువ, ననఁగ సీతాదికన్యక ల్దనరి రపుడు.

245


సీ.

వలకారియంచ గావలెఁ గాకయున్నచో నధరంబు చరణంబు లరుణ మగునె
కలికిరాచిలుక గావలెఁ గాకయున్నచో ననవిల్తుని వహించుకొనఁగఁ గలదె
కళుకురత్నంబు గావలెఁ గాకయున్నచోఁ గన్నభూసతి రత్నగర్భ యగునె
తొలుకాఱుమెఱుఁగు గావలెఁ గాకయున్నచోఁ జంచలాలోకము ల్సంఘటిలునె


తే.

కంతుబాణంబు గావలెఁ గాకయున్న, భువనమోహనశృంగారపూజ్య యగునె
యనుచుఁ బొగడంగ సకలలోకైకమాన్య, యయ్యును నమాన్యయై మించె నవనికన్య.

246


వ.

అంత జనకమహీకాంతానుమతంబున వివాహముహూర్తంబు సమీపంబయ్యె
నని పురోహితులు పిలువ వచ్చిన.

247


సీ.

ఒరపుగా విరజాజిసరులతో సిగవైచి లాగియా బురుసాకులాయి బెట్టి
గీరికప్రంపుచిక్కెంటనామము దీర్చి శ్రీచూర్ణరేఖ రంజిల్లఁజేసి
మురువుగా హురుమంజిమురువుతో వీనుల కట్టాణి గొప్పచౌకట్లు దాల్చి
మణిహారముల కుంకుమపుపూఁత దెలియంగ రంగైనముత్యాలయంగి దొడిగి


తే.

పెద్దపీతాంబరము గండపెండరంపు, కటకకటిసూత్రకేయూరకంకణాది
దివ్యభూషణజాలంబుఁ దేజరిల్ల, రాముఁ డభినవశృంగారధాముఁ డయ్యె.

248


తే.

చెలులు గైచేసి రటువలెఁ జెలువుమీఱఁ, దోనలక్ష్మణభరతశత్రుఘ్నులకును
నృపసుతచతుష్టయంబు సుదృగ్జనైక, మోహనంబయి తగెఁ జతుర్వ్యూహగరిమ.

249


వ.

ఇత్తెఱంగున రఘుపుంగవుండు దమ్ములుం దానును గల్యాణోచితకల్యాణమణి
మయకల్యాణప్రసూనప్రముఖప్రసూనమాలికాకనకాంబరాదిచతుర్విధశృంగా
రంబు లంగీకరించి మునిపతంగమంగళాశీర్వచనపురస్సరంబుగా గృహాంగ
ణంబు వెలువడి చతుర్దంశంబులు హరిదంతదంతిసత్త్వంబులుం గుందదంత
ప్రభాంగంబులు నగుదంతావళచతుష్టయంబు నెక్కి కరంబుల నంకుశంబు
లంకించి తదగ్రంబులం జూళికల సోఁకించుచు వచ్చునప్పుడు.

250


సీ.

పార్శ్వభాగంబులఁ బట్టిన పదివేలపగలువత్తులుఁ బట్టపగలు సేయఁ
దగిలింపఁ జిఱ్ఱన నెగయు నాకాశబాణంబు లంబరవిమానముల దాఁట