పుట:Dashavathara-Charitramu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తెరమఱుఁగు వాసి యీలీలఁదీరు సూపు, సీతమొగ మను క్రమమున శీతకరుఁడు
దోఁచె నచ్చెల్వ దృష్ట్లనాఁ దొగలు సెలఁగె, నిండె నీనవ్వు లనఁగ వెన్నెలలు గంటె.

180


క.

అని పలికి ప్రొద్దువోయెన్, జనవర నిద్రింపు మనుచు సంయమివర్యుం
డనుజుండును శయనింపఁగఁ, దనకంటికి నిదుర రాక తద్దయుఁ బ్రేమన్.

181


ఉ.

కన్నులఁ జూడకున్న మహికన్యక తాదృశకౌశికోక్తులం
గన్నులఁ గట్టినట్లయినఁ గన్నులవింటివజీరు నిద్దపుం
గ్రొన్ననవాఁడితూపు లెదఁ గ్రుచ్చుక వెన్నున దుస్సి పాఱఁగా
విన్నదనంబు దోఁప రఘువీరుఁడు మోహముచేఁ దలంకుచున్.

182


ఉ.

ఎప్పుడు తెల్లవాఱు నిఁక నెప్పుడు మైథిలిరాజుఁ గాంతు నే
నెప్పుడు చంద్రమౌళిధను వెక్కిడుదుం ధరణీకుమారి నే
నెప్పుడు చెట్టవట్టుదు నభీష్టము లెప్పుడు గాంతునంచుఁ దా
నెప్పుడు నెంచుఁగాని యెనయింపఁ డొకప్పుడు నిద్రకంటికిన్.

183


వ.

ఇత్తెఱంగున సీతాకాంతనుం దలంచి యంతయు నంతరంగంబునఁ జింతించు రఘు
కాంతుం డొక్కింత నిదురింప నంత వందిజనులచెలు వంది ద్విజబృందంబులు కల
కలధ్వనుల మేల్కొని యర్ఘ్యప్రదానంబున నరవిందసఖునకు మందేహజయంబు
నొందించి విదేహరాజపురంబునకుఁ జనునెడ విరహచ్ఛిదేహవిదేహశరవ్యూహ
కీలితదేహుండగు రఘూద్వహునకుం గౌశికుం డిట్లనియె.

184


మ.

అదె కన్గొంటివె వజ్రసాల మదె ఖేయవ్యాజపాథోధి య
ల్లదె వైదేహనృపాలశేఖరమహోద్యద్రత్నసౌధాగ్ర మ
ల్లదె రథ్యాగృహకేతుజాతమదవేశ్యాభర్మహర్యాలి య
ల్లదె యత్యుత్తమవాజిశాల యని యాయాదిక్కులం జూపుచున్.

185


సీ.

ఆరెకట్టికవార లందంద కుంతము ల్గొని ముందుగాఁగ ఢీకొల్పుచుండ
హరిదంతదంతిజయంబును సూచించు కరణిని డవిణెమలహరులు మొఱయ
ధర బూను మనుచుఁ బాదముఁ బట్టి విడువని చిలువఱేఁ డన వెండిగొలుసు దనర
గంధాంధమధుపసంఘంబులు మాత్రమె కాని సరసఁ జేరక భీతి జనము దొలఁగఁ


తే.

జాల మదమున మావంతు గాలుమీఱి, వచ్చుదంతావళముఁ గంటె వసుమతీశ
కేలు మొగుచుచు నున్న దీవేళ నీకుఁ, బుడమికన్నియ నడలకు జడిసి కాదె.

186


క.

అని దాని కోసరిల్లుచు, మనుజేంద్రకుమారుతీరు మౌనుల మేమౌ
టను దాని కోసరిల్లుట, సనునె కదా యనుచు సరససల్లాపములన్.

187


సీ.

నగరివిద్వాంసు లందలములు డిగ నూరకందలం బెక్కి పొం డని నుడువుచు
నల్లంతఁ గనినంతేఁ బల్లకీల్ డిగ్గి భూవల్లభు ల్మ్రొక్క దీవన లొసఁగుచుఁ
గేవలభక్తితో లేవవణిక్కులఁ గ్రేవలనఁటఁ గటాక్షించికొనుచు
రాముసౌందర్యంబు ప్రేమఁ జూచుచు వచ్చు కామినీజనులఁ గ్రేఁగంటఁ గనుచు