పుట:Dashavathara-Charitramu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్వరముగ నీడ్చి తెచ్చి యమవాసముఁ జేర్చుచు నిట్లు ధారుణిం
దిరుగుచు నెల్లరాజుల వధించె భృగూద్వహుఁ డట్టివేళలన్.

138


సీ.

కొట్టివైచినతల ల్గుట్టలై కాటుకకొండలదండిని మెండు సూప
భూరిమాంసంబులు ప్రోవులై మించుచుఁ గాంచనాచలములకరణిఁ గాంచ
నాకసం బంటిన కీకసరాసులు రజతశైలంబులరహి వహింప
నెఱ్ఱనై నెత్తురుటేఱులు వాఱుచు శోణనదంబుల సొంపు నింపఁ


తే.

జెలఁగి మెసవుచు భూతము ల్సిందులాడె, కంకగృధ్రాదిఖగముల కఱువు దీఱె
నారదుడు మెచ్చుచును దందనాలు పాడె, ధరణి నిర్భర యగుచు సంతసముఁ గూడె.

139


తే.

ఏనుమడుగు లగుచు నిల రాజరక్తంబు, గనె శమాత్తపంచకప్రసిద్ధి
రాముఁ డాజి విజయరమఁ గూడి క్రీడింప, నలరు కుంకుమంపుఁగొలను లనఁగ.

140


సీ.

ఇవ్విధంబున రాముఁ డెల్లరాజుల ద్రుంచి చిత్రశక్తిని గురుక్షేత్రమునను
బరిహృతపాతకపంచకంబుగ క్షోణినాయకరక్తంబునను శమంత
పంచక మొనరించి భక్తితో నటఁబితృతర్పణంబు ఘటించి ధన్యుఁ డగుచు
నశ్వమేధము చేసి యలసరస్వతిలోన నవబృథస్నానంబు లాచరించి


తే.

యవని దక్షిణగాఁ గశ్యపున కొసంగఁ, దన్మహత్త్వంబునను జమదగ్ని శీర్ష
యుక్తుఁడై సప్తఋషులలో నొక్కఁ డగుచు, వెలుఁగుచున్నాఁడు నక్షత్రవీథియందు.

141


ఉ.

అంతట శాంతి గైకొని వనాంతమునం దప మాచరించె దు
ర్దాంతమహాభిరాముఁ డగురాముఁడు నయ్యెడ గాధిమేదినీ
కాంతుకుమారపౌత్రుఁ డతిఘాతుకబుద్ధి పరావసుండు క్ష
త్రాంతకుఁ జేరవచ్చి దురహంకృతి మీఱఁ దృణీకరించుచున్.

142


మ.

మును మున్నీవు ప్రతిజ్ఞ చేసితివి నిర్మూలింతు శాత్రం బటం
చును నేఁ డేల భయంబుఁ జెందితివి యిచ్చో నట్లు గాదే ప్రవ
ర్ధనరాణ్ముఖ్యుల నొంప వేమిటికిఁ గారా వారు రాజు ల్నినుం
గనినం బోవఁగనిత్తురే తొలఁగు మింకన్ దుష్ప్రతిజ్ఞానిధీ.

143


వ.

అని సదృక్షమునిసమక్షమంబునం బరావసుం డధిక్షేపించిన నతివీక్షరూక్ష
ణుండై భృగుకులాధ్యక్షుం డిట్లనియె.

144


క.

బాలురు వృద్ధు లటంచును, జాలించితిఁగాక వెఱవ క్షత్రియుల కికన్
నేలంగల రాజులను స, మూలం బాబాలవృద్ధముగ ఖండింతున్.

145