పుట:Dashavathara-Charitramu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గరముఁ ద్యజించు మింకయినఁ గాక యెదిర్చిన నోర్వఁ జెప్పితిన్
దురితము లేదు నాకిఁకను దోఁచినరీతి నొనర్తు గ్రక్కునన్.

120


చ.

పొలుపుగఁ గొండ కట్టెలకుఁ బోయెడివానివిధంబు దోఁప గొ
డ్డలి యిది యేమి దీన జగడం బొనరింపఁగ వచ్చితే బళా
బళ భృగురామ యన్న నరపాల నిజంబు సమిత్ప్రియుండనై
నలువుగ నర్జునచ్ఛిద మొనర్పఁగ వచ్చితి నంచు రాముఁడున్.

121


శా.

ఔరా విప్రుఁడ నంచు నం జులకసేయ న్వచ్చితే మంచిదే
రారమ్మా ధనువూని నీవయినక్షాత్రం బేను వీక్షించెద
న్శూరత్వంబులు మీకె యంచు నజుఁ డెచ్చో ముద్ర గావించెనే
లేరా బ్రాహ్మణశూరు నింకిటను గల్పింతు న్ననుం జూడుమా.

122


మ.

ప్రమథేంద్రుండు నుతింప నంపమొనచేఁ గ్రౌంచాద్రి భేదించి మా
ర్గముఁ గల్పించితిఁ దొల్త నంచలకుఁ దత్కాండంబుల న్నీదువ
క్షము భేదించి మదీయకీర్తినవహంసం బెల్లచోఁ బోవ మా
ర్గముఁ గల్పించెద నాబలంబు గను మింకం గార్తవీర్యార్జునా.

123


తే.

అనుచు రాముఁడు ఘనరీతిఁ దనపృషత్క, తతి సహస్రకరస్ఫూర్తి దరలఁ జేయఁ
బఱచె నంతట నర్జున పక్షబలము, మానసమున కధీనమై మనుజవమున.

124


ఉ.

అంతట భార్గవుండు భిదురాగ్రకఠోరకుఠారధార దు
ర్దాంతమహఃకృతారివనితాజనితాస్త్రము కార్తవీర్యభూ
కాంతభుజాసహస్రము సగర్వసహస్రము గాఁగ మించి వి
భ్రాంతునిఁ జేసి కుత్తుకకుఁ బాపె శిరంబున దక్షిణంబునన్.

125


తే.

కార్తవీర్యుఁడు ఘనసమీకార్తవీర్యుఁ, డగుచుఁ గూలిన నన్యోన్యమయుతు లగుచు
నతని పుత్రకు లయుతసంఖ్యాతు లెల్ల, కడల కేగిరి ప్రాణము ల్గాచికొనఁగ.

126


చ.

అసదృశకీర్తి కామగవి నాజి శరత్కబళీకృతార్జునుం
దెసలఁ జరింపఁ బంచి జగతీవరజాహృతకామధేనువున్
మసలక తెచ్చియిచ్చి నృపమారణమున్ జమదగ్ని మౌని కిం
పెసఁగఁ గుఠారి దెల్ప నత్వ డి ట్లనియెన్ సవిషాదచిత్తుఁడై.

127


సీ.

నిరతంబుఁ గొల్వఁడే దురితంబు లణఁగించు దానేప్సితత్యాగి దత్తయోగి
భుజసీమ నిల్పఁడే నిజధామసంరక్షితాబ్ధి చతుష్కాంత నవనికాంతఁ
జెఱసాల వెట్టఁడె మొఱ సాల వెట్టంగఁ బ్రధనజయోత్కంఠుఁ బఙ్క్తికంఠు
ధృతిఁ దృప్తుఁ జేయఁడే యతితప్తుఁడై వేఁడు సకలదాహామోదుజాతవేదు