పుట:Dashavathara-Charitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నూత్నదేదీప్యమానభానుప్రభుండు, నవ్యవిభవుండు నారాయణప్రభుండు.

52


సీ.

అతనుండు మొదల హ్రస్వాకారుఁ డౌటచేఁ జెలువంబునను సాటిసేయరాదు
గురుఁడును సర్వలఘుత్వ మొందుటఁ జేసి యాయతమతి సాటి సేయరాదు
రవిఁ గడపట వివర్ణంబు గాంచుటఁ జేసి స్థిరతేజమున సాటి సేయరాదు
శారదాబ్దం బపశబ్దం బగుటఁ జేసి చిరకీర్తితో సాటిసేయరాదు


తే.

సాటియే నేఁటి యొకపాటిసచివకోటి, వైరిగిరిశతకోటికి వచనవిభవ
భవతులాకోటికి వితీర్ణిపాండితీని, రస్తచింతామణికి నారనార్యమణికి.

53


మ.

అగధీరుం డగునారనార్యుఁ డవురా యాసానబూదూరిలోఁ
దగవిశ్వేశ్వరు నన్నపూర్ణ నట చెంతం డుంఠి విఘ్నేశ్వరు
న్నిగమస్తుత్యుని క్షేత్రపాలు మణికర్ణిం గల్గఁగాఁ జేసె విం
తగ సాధుల్ఫలదాత్రి భావనయకాదా యంచుఁ గీర్తింపఁగన్.

54


సీ.

వనిలోన స్త్రీమాట విని యన్న కొకవంత దెచ్చిన లక్ష్మణదేవుఁ దెగడి
తనవింటిబ్రద్దఁ దిట్టెనటంచు నగ్రజు దూషించినట్టి పార్ధుని హసించి
యన్నపక్షము వారి నటు డించి తా నొకపక్షమౌ పుండరీకాక్షు నవ్వి
మును దా గురుద్రోహమునకు లోనై యగ్రభవునకుఁ జేర్చిన లవునిఁ దెగడి


తే.

హర్ష మొసఁగుచు మాఱుమాటాడ వెఱచి, యన్నపక్షము దనపక్ష మై చెలంగ
బహుళసుకృతంబు లొనఁగూర్చి ప్రబలుఁ బద్మ, నాభుననుజుండు నారాయణప్రభుండు.

55


శా.

ఆనారాయణమంత్రిశేఖరుఁ డమిత్రాంభోదపాళీజగ
త్ప్రాణుండౌ కురుగోటిమాధవయకు న్రామక్కకుం బుత్రియై
తోనం దిమ్మయవీరరాఘవముఖుల్ దోఁబుట్టులై వర్తిలన్
శ్రీనారీమణిఁబోలు వెంకమ వరించె న్వేడుక ల్మించఁగన్.

56


తే.

అసము వొసగంగ మఱియు రాయసము చెలవ, యార్యమౌళికి నారాయణమ్మ కాత్మ
జాతయైనట్టి నరసమ్మ సమత మించు, మమత వరియించె నారనామాత్యవిభుఁడు.

57


సీ.

తనయాశ్రితుల సంపదలఁ జూచి ధనభర్త ధనవాంఛ శివుఁగూర్చి తపము సేయఁ
దనవిలాసము గనుంగొని నీటు వెట్టెడు సూనాస్త్రురతియును చుక్కు రనఁగఁ
దనదానజలవార్ధిఁ గని యుల్కినయగస్త్యుఁ గడల దాపసుల కేరడము లాడఁ
దనవైభవమును జూచినవార లింద్రుఁ డం చొరులతోఁ బన్నిదం బూనికొనఁగఁ


తే.

బ్రబలు దేశాధినాథనబాబుసాహి, బూవితీర్ణసువర్ణజాంబూనదాంబ
రాసమగ్రామబహుమానభాసమాన, నవ్యవిభుఁ డాదినారాయణప్రభుండు.

58