పుట:Dashavathara-Charitramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

జలధిమధ్యస్థుఁ డాతఁడు జలధితీర, వాసి యితఁ డనునొకమాట వాసి గాక
పద్మనాభుండు మగదల పద్మనాభుఁ, డఖిలలోకావనమున నన్యోన్యసములు.

46


ఉ.

[1]కోసలరాజకన్యకయె కుంభినిలోపల వేంకటాంబయై
భాసిలఁ బద్మనాభుఁడయి ప్రాగ్రఘువీరుఁడు పుట్టెఁ గానిచో
మాసము తార లగ్నము సమస్తశుభగ్రహవీక్షణంబు లొం
డై సరివచ్చువేళ నుదయంబగునో విబుధాళిఁ బ్రోచునో.

47


మ.

ధనదోదారుఁడు పద్మనాభ సచివాధ్యక్షుండు పక్షంబుతో
ననఘాత్యుత్తమదొడ్లప్రతికులజుం డైనట్టిధర్మప్రధా
నునికామాక్షమకుం జనించి బుధరాణ్ణుత్యస్ఫురల్లక్షణా
వనియౌ రంగమఁ బెండ్లియాడె మహితైశ్వర్యం బవార్యంబుగన్.

48


సీ.

పతిభక్తిచే నరుంధతి యుద్ది యనవచ్చుఁ దను వ్రేలఁ జూపించికొనకయున్న
దాక్షిణ్యమున శైలతనయ జోడనవచ్చు నీశువిగ్రహమున నెనయకున్న
క్షాంతిచే ధారుణి సరి యనవచ్చు ధాతను జేరి మొఱపెట్టుకొనకయున్న
మతిమహత్త్వమున భారతి సాటి యనవచ్చుఁ బ్రజలనోళ్లకు నెల్ల రాక యున్న


తే.

గాక యితరధరాతలకాంత లెనయె, యంచు జను లెంచ నంచితోదారసుగుణ
మణిగణంబుల కెల్లయై మనుముఖాబ్జ, రచితశశిబింబ మగదల రంగమాంబ.

49


సీ.

ఏసాధ్వి [2]పెరటిలో నెలదోఁటఁ గని వజ్రనందనవని నిందనం బొనర్చు
నేయంబ పెండ్లిండ్ల కిప్పింపఁగా బ్రహ్మచారులు కఱవైరి జగతిలోన
నేతల్లి వడ్డింప నింపుతో భుజియించు జనులకు మాతృవిస్మరణ మొదవు
నేయమ్మ దయఁ బాలువోయింపఁ బురబాలు రాయురారోగ్యభాగ్యములు గాంతు


తే.

రట్టిలోకైకపావని యఖిలవిమల, గుణకలాపావని తటాకకోటిభాగ
సుప్రతిష్ఠితపావని క్షోణి వెలయు, రక్షితమహీసురకుటుంబ రంగమాంబ.

50


ఉ.

శ్రీయలమేలుమంగవలెఁ జెన్నగురంగమగర్భవార్ధిచం
ద్రాయితవేంకటేశసచివాగ్రణి కృష్ణసుధీవరుండు నా
రాయణమంత్రిశేఖరుఁడు రామవిభుండును వేంకటేశుఁ డ
త్యాయతకీర్తిశాలు లుదయంబయి రాశ్రితకల్పశాఖులై.

51


సీ.

శ్రీవరేశ్వరులకుఁ గోవెల లూరూరఁ గట్టించె నేమంత్రి ఘనత మెఱయ
నాకాశిసేతుమధ్యస్థపుణ్యస్థలుల్ సేవించె నేమంత్రి ఠీవి వెలయ
ఖ్యాతి కెక్కఁగ దీర్ఘికాతటాకంబులు త్రవ్వించె నేమంత్రి తఱుచుగాఁగ
సకలమార్గంబులఁ జల్లగా వనములు వేయించె నేమంత్రి వేడ్క మీఱ


తే.

నతఁడు చెలువొందు నన్నదానాదిసకల, దానవిద్యాపరాభూతధనవిభుండు

  1. కోసలరాజనందనయె
  2. పేరిటియెలదోఁటఁ